logo

హోరెత్తిన కూడళ్లు.. కదిలొచ్చిన శ్రేణులు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రోడ్‌షోలు...కార్నర్‌ మీటింగ్‌లు కార్యకర్తల్లో హుషారు నింపుతున్నాయి.

Published : 06 May 2024 04:21 IST

ఈనాడు, హైదరాబాద్‌

శంషాబాద్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రోడ్‌షోలు...కార్నర్‌ మీటింగ్‌లు కార్యకర్తల్లో హుషారు నింపుతున్నాయి. సికింద్రాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో రెండురోజుల వ్యవధిలో నిర్వహించిన మీటింగ్‌లకు శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఆలస్యంగా సభలు ప్రారంభమవుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చేంత వరకు ఓపికతో వేచి ఉంటున్నారు. సమస్యలను అప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, తుక్కుగూడ, శంషాబాద్‌లో జరిగిన రోడ్‌షోలకు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తుక్కుగూడ కూడలిలో ఆదివారం రాత్రి జరిగిన కార్నర్‌ మీటింగ్‌కు కిలోమీటర్‌ వరకు కార్యకర్తలతో రహదారి కిక్కిరిపోయింది. అటు నుంచి శంషాబాద్‌ బస్టాండ్‌కు చేరుకునేలోపే ఆ ప్రాంతమంతా కార్యకర్తలతో నిండిపోయింది.

తుక్కుగూడలో జరిగిన ముఖ్యమంత్రి రోడ్‌షోకు హాజరైన జనంతో కిక్కిరిసిన కూడలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని