పాలమూరు... ప్రచార హోరు
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయంపై ఎవరి ధీమా వారిదే
న్యూస్టుడే, బొంరాస్పేట, కొడంగల్
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్నగర్ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేరుగా రంగంలోకి సీఎం..
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మహబూబ్నగర్ వాసిగా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఎదిగిన రేవంత్రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించారు. జిల్లాకు శక్తిమేరకు సాయం చేయాలని తరచూ స్థానిక నేతలతో మాట్లాడటమే కాదు తానే చొరవ తీసుకుని మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డిని పోటీలో నిలబెట్టారు. ఆయన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇప్పటికి జిల్లాలో రెండుసార్లు ప్రచారం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవడంతో వంశీచంద్రెడ్డి విజయం కాంగ్రెస్ శ్రేణులుధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ వారే..: పాలమూరు లోక్సభ స్థానానికి సీˆఎం ఇన్ఛార్జిగా ఉండటంతో పాటు దీని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి కచ్చితంగా 50 వేల మెజార్టీ రావాలని సీఎంఆదేశించారు. ఇదే లక్ష్యంతో కార్యకర్తలు, నేతలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని భారాస ముఖ్యనేతలు, పార్టీని వీడుతూ కాంగ్రెస్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో నేతల్లో ఉత్సాహం రెట్టిపవుతోంది.
కేసీఆర్ పథకాలే బలం.. నమ్మకం
ముఖ్యమంత్రిగా కేసీˆఆర్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అంటున్నారు. వాటినే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కోస్గికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఎల్ఈడీ తెరలపై కాంగ్రెస్ హామీలు ఎలా అమలు కాలేదో చూపించి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. కేసీˆఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వివరించేలా అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి తగిన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ మహబూబ్నగర్లో నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే జోష్తో ప్రచారం కొనసాగిస్తున్నారు.
మోదీ పాలన చూపిస్తూ.. ఆశలు కల్పిస్తూ..
కేంద్రంలో పదేళ్ల మోదీ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పార్టీ అభ్యర్థి డీకే అరుణ ఎక్కడ ప్రచారం చేసినా చెబుతున్నారు. కాంగ్రెస్ హామీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాను గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కేంద్ర పథకాలను అమలుచేస్తామంటూ స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా కృష్ణా - వికారాబాద్ రైల్వేలైన్ పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఆమె గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో ప్రతి గ్రామంలో కొంత పట్టు ఉండటం కలిసి వచ్చే అవకాశంగా శ్రేణులు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
[ 19-05-2024]
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. -
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
[ 19-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో సరఫరా చేసే విధానం అందుబాటులోకి వచ్చినట్లు జలమండలి ప్రకటించింది. ఇక నుంచి 3-4 రోజులపాటు నిరీక్షణ ఉండదని పేర్కొంది. -
మడతల చొక్కా వేసుకో.. పర్యావరణాన్ని కాపాడుకో
[ 19-05-2024]
ఎండలైనా, వానలైనా అసాధారణంగా ఉంటున్నాయి. ఎందుకిలా అని వాతావరణ శాస్త్రవేత్తలను అడిగితే పర్యావరణ మార్పుల ప్రభావం అంటున్నారు. తగ్గించేందుకు మన వంతుగా ఏమైనా చేయవచ్చా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు.. ఓవైపు ల్యాబ్ల్లో ప్రయోగాలు చేస్తూనే.. -
పట్టుదలతో చదివి.. సత్తా చాటి
[ 19-05-2024]
పట్టుదల, ఏకాగ్రతతో ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఈఏపీ సెట్-24 పరీక్ష ఫలితాలు శనివారం ప్రకటించారు. -
గంటలో కుంటలా...
[ 19-05-2024]
వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్ నగర్లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
స్థానిక సంస్థలపై కాంగ్రెస్ గురి
[ 19-05-2024]
నార్సింగి మున్సిపాలిటీ ఛైర్పర్సన్ దారుగుపల్లి రేఖ, వైస్ఛైర్మన్ వెంకటేశ్యాదవ్(భారాస)లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. వీరిపై మెజార్టీ సభ్యులు అందజేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మున్సిపల్ కార్యాలయంలో శనివారం రాజేంద్రనగర్ ఆర్డీవో కె.వెంకట్రెడ్డి -
పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు
[ 19-05-2024]
జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. -
జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి
[ 19-05-2024]
నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్క్లోజర్ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) దత్తత తీసుకొంటోంది. -
సెప్టెంబరుకు.. ‘సుంకిశాల’ అందేనా?
[ 19-05-2024]
నాగార్జునసాగర్ డెడ్స్టోరేజీ నుంచి సైతం నగరానికి నీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి సమాయత్తమవుతోంది. -
చిన్న వర్షం.. అతలాకుతలం
[ 19-05-2024]
నగరంలో వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. -
మానసిక కుంగుబాటుతో చందు బలవన్మరణం
[ 19-05-2024]
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) అలియాస్ చందు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. త్రినయని సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న చందు శుక్రవారం మణికొండలో బలవన్మరణానికి పాల్పడటం తెలిసిందే. -
సైబర్ నేరస్థులకు.. ‘మ్యూల్’ ఖాతాలు తెరుస్తూ..
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయిదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్శర్మ తెలిపారు. -
నాసిరకం ముప్పు.. కావాలి కనువిప్పు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ దగ్గర పడుతోంది. పొలాలను శుభ్రం చేసే పనులు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా నాసిరంక విత్తనాలు కూడా విపణిలోకి తెచ్చేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. -
పర్యవేక్షణ శూన్యం.. ఇసుక మాయం
[ 19-05-2024]
ప్రభుత్వ లక్ష్యానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నిర్మాణాలు సాగాలి. గుత్తేదారు దానికి తగినట్లుగా పనులు చేయాలి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. -
12 శాతం రిజర్వేషన్ కోసం మాదిగ జన సభలు
[ 19-05-2024]
తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
చెత్త కుప్పలు తొలగించేదెవరు?
[ 19-05-2024]
ఎన్ని చర్యలు తీసుకున్నా పారిశుద్ధ్యం పట్టాలెక్కడం లేదు. నగరవ్యాప్తంగా 23 లక్షల ఇళ్లు ఉన్నాయని అంచనా. వాటన్నింటి నుంచి నిత్యం చెత్త సేకరణకు ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలున్నాయి. -
అటవీ భూమి కేటాయింపులు సబబే
[ 19-05-2024]
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇమారత్ కంచ, సరూర్నగర్ మండలం మామిడిపల్లిలో అటవీ భూమిని అటవీయేతర అవసరాలకు ప్రభుత్వం కేటాయించడాన్ని హైకోర్టు సమర్ధించింది. -
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోకరా
[ 19-05-2024]
కొంపల్లిలో ఖరీదైన ప్రాంతంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 350 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసి మోసగించిన ముగ్గురు మోసగాళ్లను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు
[ 19-05-2024]
పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. -
వారణాసిలో ప్రచారానికి భాజపా బృందం
[ 19-05-2024]
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రమోదీకి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు 10 మంది సభ్యులతో కూడిన భాజపా బృందాన్ని ఎంపిక చేశారు. -
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి
[ 19-05-2024]
రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ -
రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం
[ 19-05-2024]
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన నిందితుడిని ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కథనం ప్రకారం.. -
క్యాన్సర్పై సమగ్ర పుస్తకం అభినందనీయం
[ 19-05-2024]
క్యాన్సర్ మహమ్మారికి శాశ్వత పరిష్కారం దిశగా పరిశోధనలు జరగాలని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ అన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ (సీపీఎంబీ) డైరెక్టర్ డా.రామకృష్ణ
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ