logo

ఉపాధ్యాయుడిగా ఎమ్మెల్యే..!

రామడుగు మండలం గోపాల్‌రావుపేట ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుడి అవతారమెత్తి తొమ్మిది, పదో తరగతి గదుల్లో పాఠాలు బోధించారు.

Updated : 02 Dec 2022 06:57 IST

రామడుగు మండలం గోపాల్‌రావుపేట ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుడి అవతారమెత్తి తొమ్మిది, పదో తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరారు. ఎంపీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, నాయకులు మార్కొండ కిష్టారెడ్డి, ఎడవెల్లి పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, రామడుగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని