ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా గంగాధర, నారాయణపూర్ జలాశయాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది.
నారాయణపూర్ జలాశయంలో బోసిపోతున్న పంపులు
న్యూస్టుడే, గంగాధర: ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా గంగాధర, నారాయణపూర్ జలాశయాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది. ఇప్పటికే సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా బీడుగా వదిలేసిన వారు, మిగిలిన పంటనైనా కాపాడుకోవాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయల అప్పులు చేసి బావి లోతు తవ్వుతూ నీటిని అందించేందుకు ఆరాటపడుతున్నారు. మరో వైపు అరకొర సాగునీటితో వేసిన వరిపంటకు మొగిపురుగు, ఇతర తెగుళ్లతో పెట్టుబడులు గుదిబండగా మారాయి. పంట చేతికి రావాలంటే ఇంకెన్ని పాట్లు పడాలోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో తెగిన చెరువు కట్టలు
వర్షాకాలంలో భారీ వరదలకు గంగాధర, నారాయణపూర్ చెరువుల కట్టలు తెగిపోగా నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. రైతుల ఆందోళనతో ప్రభుత్వం రూ.90 లక్షల నిధులు మంజూరు చేయగా నారాయణపూర్ చెరువు కట్ట మరమ్మతులు పూర్తి చేశారు. అయితే తమకు రావాల్సిన పరిహారం చెల్లించాకే గంగాధర ఎల్లమ్మ చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని మంగపేట గ్రామస్థులు పలుసార్లు అధికారులను అడ్డుకున్నారు.
నీరు విడుదల చేస్తేనే..
గడిచిన ఆరేళ్లుగా రెండు పంటలకు ఎల్లంపల్లి నీటిని గంగాధర, నారాయణపూర్ చెరువుల ద్వారా వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు ఎత్తిపోస్తున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తుండగా ఈ యాసంగిలో విడుదలపై సందిగ్ధంతో సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా వదిలేశారు. వానాకాలంలో పంటలకు తెగుళ్లతో పెట్టుబడులు భారమై దిగుబడులు అంతంత మాత్రమే వచ్చాయి. యాసంగి పంటలను నమ్ముకున్న రైతాంగానికి జల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బోయినపల్లి, వేములవాడ వైపు కుడికాలువ పూర్తి కాకపోగా ఎగువ గ్రామాల్లో కేవలం ఆరుతడి పంటలు వేస్తుండగా ఇప్పుడు చెరువులకు గండ్లు పడి ఎడమ కాలువకు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. గంగాధర, కొడిమ్యాల, మల్యాల, రామడుగు, చొప్పదండి మండలాల్లో ఈ ప్రాజెక్టు ఆధారంగా దాదాపు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ నెలాఖరుతో ఎండలు ముదరనుండగా బావులు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారాయణపూర్ జలాశయాన్ని ఆనుకుని ఉన్న పొలాలు బీటలు వారాయి. పశువులకు మేతగా వదిలేశారు. నారాయణపూర్ చెరువును ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా నింపి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.
పశువుల మేతకు...
- పెద్దోళ్ల మల్లయ్య, చర్లపల్లి ఎన్
నారాయణపూర్ పంపుల పక్కనే అయిదు ఎకరాల్లో పంటలు వేయక బీడుగా వదిలేశా. నాలుగున్నర ఎకరాల్లో వేసిన పంటకు తెగుళ్లు సోకి పెట్టుబడులు భారంగా మారాయి. కూలీకి రూ.500, మందు బస్తాకు రూ.1800, వడ్ల బస్తాకు రూ.1000 పెట్టుబడులు వెచ్చిస్తే పైపులైన్లతో నీరు విడుదల చేయడం లేదు. ఎండిన పొలం పశువులకు మేతకు వదిలేశా. మా కుటుంబానికి వ్యవసాయమే ఆధారం.
రూ.2 లక్షలతో బావి లోతు తవ్విన..
- గుంటి దేవయ్య
నాలుగున్నర ఎకరాల్లో వరి వేస్తే రెండెకరాలు ఎండిపోతోంది. ఇది పోయినా మరో పంటకైనా నీరు పారించుకోవాలని రూ.2 లక్షలతో బావిని ఆరు గజాల లోతు తవ్విన. రూ.1.50 లక్షల పెట్టుబడులు వెచ్చించిన. ఈ పంటలో రూ.3.50 లక్షల దిగుబడులైతే రావు. ఇప్పటికే పంటకు తెగుళ్లు సోకి రెండుసార్లు మందు పిచికారీ చేశా. పెట్టుబడులు పెరిగిపోగా నీరు లేక దిగుబడులు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్లంపల్లి నీరు విడుదల చేసి పంటలు కాపాడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM