logo

కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి

కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

Published : 03 May 2024 03:04 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. గోదావరిఖనిలోని భారాస కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఇష్టారీతిగా ఎమ్మెల్యేలు వివేక్‌వెంకటస్వామి, మక్కాన్‌సింగ్‌లు తనపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  వివేక్‌ ఈ ప్రాంతానికి చేసిన సేవ ఏమిటో చెప్పాలన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, భారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు