ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది.
లోక్సభ ఎన్నికల్లో అంతంతే ప్రాతినిధ్యం
ఈసారి ఆరుగురే మహిళా అభ్యర్థులు
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. ఓవైపు నారీ శక్తి అభియాన్ కింద భవిష్యత్తులో పాలనలో అతివల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ దిశగా అడుగులు పడలేదు. కొందరు నామమాత్రంగా నామినేషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. మూడు లోక్సభ స్థానాల పరిధిలో ప్రధాన పార్టీల తరఫున మహిళా అభ్యర్థులే లేరు. ఓటర్ల పరంగా దాదాపు 52 శాతం ఉన్న వీరికి పోటీపరంగా మాత్రం ప్రాధాన్యం తగ్గడం గమనార్హం.
1.52 లక్షల మంది అధికం
కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 24.61 లక్షల మంది పురుషులు, 26.13 లక్షల మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే దాదాపు 1.52 లక్షల మంది అతివలు ఎక్కువగా ఉన్నారు. ఓటేయడంలోనూ వీరే ముందుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్ వేసిన వారిలో విద్యావంతులే అధికంగా ఉండటం విశేషం. తమ ప్రాబల్యాన్ని చూపాలనే తపనతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా, మరికొందరు రిజిస్టర్డు పార్టీల తరఫున బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఎంపీలుగా ఆ ఇద్దరే!
సుగుణకుమారి, కవిత
కరీంనగర్లో 1952 నుంచి నాలుగు ద్విసభ్య ఎన్నికలు, 16 సాధారణ ఎన్నికలతో కలిసి ఇప్పటివరకు 20 సార్లు ఎన్నికలు నిర్వహించగా ఒక్క మహిళ కూడా ఎన్నికవలేదు. 1952లో టీఎన్ సదాలక్ష్మి(కాంగ్రెస్) పోటీ చేసి ఓడిపోయారు. పెద్దపల్లి నుంచి 1998లో తొలిసారిగా తెదేపా నుంచి బరిలోకి దిగిన చెలిమెల సుగుణకుమారి రాజకీయ కురువృద్ధుడు వెంకటస్వామిపై విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీగా ఆమె గుర్తింపు పొందారు. 1999లో వెంకటస్వామిపై రెండోసారి గెలుపొందారు. 2014లో నిజామాబాద్ స్థానంలో కల్వకుంట కవిత(తెరాస) పోటీ చేసి మధుయాస్కీగౌడ్ (కాంగ్రెస్)పై జయకేతనం ఎగురవేశారు. 2019లో ఆమె రెండోసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
అడుగేస్తేనే కదా తెలిసేది
ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఉమ్మడి జిల్లాలో 50 శాతానికి పైగా మహిళా భాగస్వామ్యం ఉంది. క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులుగా వారే ముఖ్య భూమికను పోషిస్తున్నారు. 2029 నాటికి ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లు కల సాకారమై, మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో కచ్చితంగా ఏడు చోట్ల అతివలకే అవకాశం రానుంది. ఇప్పటి నుంచే నారీమణుల్లో నాయకత్వ పటిమ పెరిగితే వచ్చే అయిదేళ్ల నాటికి ఎన్నికల్లో పోటీకి అనుకూలంగా ఉంటుంది.
తేనీరు తయారు.. ఆదరించాలి మీరు
పెద్దపల్లి భాజపా అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గురువారం కమాన్పూర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో టీ కాచి స్థానికులను ఆకట్టుకున్నారు.
-న్యూస్టుడే, కమాన్పూర్
నీ భవితకు నాదీ హామీ
కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గురువారం తిమ్మాపూర్ మండలంలో ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మన్నెంపల్లిలో బాలుడితో ముచ్చటిస్తూ నడుస్తున్న దృశ్యమిది.
న్యూస్టుడే, తిమ్మాపూర్
అక్కలారా.. ఇదీ అభయ హస్తం
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా మంత్రి ప్రభాకర్ గురువారం జమ్మికుంట మండలంలో ప్రచారం చేశారు. కొత్తపల్లి-ధర్మారం రహదారిపై ట్రాలీ ఆటోలో వెళ్తున్న మహిళా కూలీలతో మాట్లాడారు.
న్యూస్టుడే, జమ్మికుంట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానికం’!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలో పదిలమైందో లేదో.. అటు నాయకులు, ఇటు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు
[ 17-05-2024]
వర్షాకాలంలో దోమలతో మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. దీనికి కారణం పారిశుద్ధ్యం లోపించడం, తాగునీరు కలుషితం కావడం. -
కళల మెరుపులు.. నైపుణ్యానికి మెరుగులు
[ 17-05-2024]
కరీంనగర్ బాలభవన్ వేసవి శిక్షణ శిబిరం సందడిగా మారింది. గతంతో పోల్చితే ఈసారి అధిక మంది శిక్షణ పొందుతున్నారు. పిల్లలంతా స్వేచ్ఛగా తమకు నచ్చిన అంశాలు నేర్చుకుంటున్నారు. -
హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
[ 17-05-2024]
రాష్ట్రంలో రైతులను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చొప్పదండిలో భారాస నేతలతో కలిసి నిరసన తెలియజేసి మాట్లాడారు. -
ఉప కులపతిగా అవకాశం దక్కేదెవరికో?
[ 17-05-2024]
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ఈనెల 21తో ముగియనుండంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. -
ఓట్ల పండుగ.. ఆర్టీసీకి ఆదాయం దండిగా!
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధిక మంది వారివారి స్వస్థలాలకు బయలుదేరారు. పిల్లలకు కూడా వేసవి సెలవులు కావడంతో తమ ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపారు. -
నారసింహుడి కోవెలలో నగదు రహిత సేవలకు శ్రీకారం
[ 17-05-2024]
దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నగదు రహిత సేవలకు శ్రీకారం చుట్టారు. -
పెరిగిన గడువు.. అవకాశం మెరుగు
[ 17-05-2024]
సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు మరి కొంత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. మే 4 వరకు దరఖాస్తులకు చివరి గడువు విధించిన యాజమాన్యం తాజాగా జూన్ 4 వరకు పెంచింది. -
అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన
[ 17-05-2024]
అకాల వర్షాలు, ఈదురు గాలులు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
‘పల్లె’వించిన చైతన్యం..
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో పల్లెలు స్ఫూర్తి చాటాయి. నగర వాసుల కంటే గ్రామీణ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. -
సహజ వనరులను కొల్లగొడుతున్నారు
[ 17-05-2024]
ఇసుక, మట్టి అక్రమ రవాణాతో జిల్లాలోని సహజవనరులను అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. మానేరు వాగు నుంచి ఇసుక రవాణాపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు గాలికి వదిలేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. -
అనుసంధాన మార్గం పూర్తయ్యేనా!
[ 17-05-2024]
నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది.నిత్యం రద్దీగా ఉండే గ్రామాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారి నిర్మాణం ఆది నుంచీ నిర్లక్ష్యానికి గురవుతోంది. -
ప్రారంభించారు... తాళం వేశారు
[ 17-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆరోగ్య ఉప కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించింది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను పాలకులు ఆర్భాటంగా ప్రారంభించారు. -
రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే
[ 17-05-2024]
పార్లమెంటు ఎన్నికల తర్వాత ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామనడం రైతాంగాన్ని మరోసారి మోసం చేయడమేనని భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. -
ముందుకు సాగని ఆలయ విస్తరణ పనులు
[ 17-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీబద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. -
లైసెన్స్ లేకుండా మందులు విక్రయించిన వ్యక్తికి ఏడాది జైలు
[ 17-05-2024]
లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వచేయడంతోపాటు అమ్మకాలు చేపట్టిన ఓ వ్యక్తికి కోరుట్ల న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించింది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 17-05-2024]
పెద్దపల్లిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రామగుండం జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
-
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా