ప్రజలు మళ్లీ మోసపోవద్దు
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు.
భాజపా, కాంగ్రెస్లను ఓడించాలి
బహిరంగ సభలో భారాస నేతలు
భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు సంఘీభావం తెలుపుతున్న కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా భారాస అధ్యక్షుడు విద్యాసాగర్రావు
ఈనాడు, నిజామాబాద్: భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో బాజిరెడ్డి ప్రసంగించారు. మనమందరం రాముడిని కొలుస్తామని.. సకల సుగుణాలు ఉన్న పురుషోత్తముడి గురించి భాజపా నాయకులకు తెలియదన్నారు. ఆ మహా పురుషుడి పేరు చెప్పుకొని పాలన సాగించే మోదీ పేదలను విస్మరించారని విమర్శించారు. ఒకే కుటుంబం నుంచి తండ్రి-కొడుకులు ఎంపీలుగా ఉండటం అరుదుగా ఉంటుందని, ఆ అవకాశం దక్కిన అర్వింద్, ఐదేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి.. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇక్కడి ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లుగా ఇటువైపు రాని వ్యక్తి.. ఎంపీగా గెలిపిస్తే వస్తాడనే నమ్మకం లేదన్నారు. అసలు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డితోనే పోయిందని.. ఇప్పుడు పాత కాంగ్రెసోళ్లు రేవంత్కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించానన్నారు. ఎంపీగా అవకాశమిస్తే ప్రజల గొంతును లోక్సభలో వినిపిస్తానన్నారు. మాజీ మంత్రలు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాజ్యసభ ఎంపీ సురేష్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి మహమూద్ అలీ, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల భారాస అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఆశన్నగారి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా సభలో ప్రసంగించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తప్పుడు కేసులతో భారాస నేతలను ఇబ్బంది పెడుతున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు. చిన్న కేసులో తన కొడుకును చిత్రహింసలకు గురిచేసి.. రాజకీయ కక్ష సాధింపులకు దిగారని అయోషా ఫాతిమా పేర్కొన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్తో ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
గులాబీ శ్రేణుల్లో జోష్..
అధికారం కోల్పోయాక భారాస తొలి బహిరంగ సభను శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించింది. చెప్పిన సమయం కంటే ఆలస్యమైనప్పటికీ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావటంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు ఉద్యమ కాలంలో మాదిరిగా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. అధిష్ఠానం నుంచి పెద్ద నాయకులు ఎవరూ రానప్పటికీ.. ఉన్న నాయకత్వమే పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తూ మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో పార్టీకి పూర్వవైభవం తేవడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చిన సందర్భంలో కార్యకర్తలు సానుకూల నినాదాలతో హోరెత్తించారు. గ్రామగ్రామన ప్రచారం ఉద్ధృతం చేసి నిజామాబాద్ స్థానాన్ని గెలుపించుకుందామని నాయకులు కోరారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రెండు జిల్లాల జడ్పీ ఛైర్మన్లు విఠల్రావు, వసంత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సభ్యులు జగన్, సుమన, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకులు చర్చకు రావాలి
[ 02-05-2024]
అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నాయకులు ఆధారాలతో సహా చర్చకు రావాలని, నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.రోహిత్రావు డిమాండ్ చేశారు. -
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 02-05-2024]
ఓ యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్కు చెందిన బెత్తపు -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
[ 02-05-2024]
నిత్యం ప్రజల మధ్య ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
హస్తాన్ని నమ్మొద్దు.. కమలం మాయలో పడొద్దు
[ 02-05-2024]
కాంగ్రెస్ను నమ్మొద్దని, భాజపా మాయలో పడొద్దని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. -
ఆ పార్టీలకు డిపాజిట్లు రావు
[ 02-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, భారాసలకు డిపాజిట్లు కూడా రావని, రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
నేటి కేసీఆర్ బస్సు యాత్ర రద్దు
[ 02-05-2024]
భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సు యాత్రపై ప్రభావం పడింది. -
సమష్టి కృషితో స్వయం ప్రతిపత్తి
[ 02-05-2024]
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది. ప్రస్తుతం కరీంనగర్లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు మాత్రమే ఆ హోదా ఉంది. -
కార్మిక క్షేత్రం.. తీర్పు విలక్షణం
[ 02-05-2024]
కార్మిక క్షేత్రమైన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం.. ఆది నుంచి ప్రజా తీర్పులో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడి ఓటర్లు ప్రతి పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారమిస్తూ, తర్వాత కొత్త వారికి అవకాశమిస్తున్నారు. -
కీలక సంస్కరణల వెనుక..
[ 02-05-2024]
‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ కేసుకు సంబంధించి 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛలో ‘నోటా’ భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
పురపాలికలకు ముందస్తుగా కాసుల జమ
[ 02-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తుగానే కాసుల గలగల కనిపించింది. గత నెల 1 నుంచి 30 వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు అయిదు శాతం రాయితీ ఇచ్చారు. -
మామ చేతిలో కోడలి హతం
[ 02-05-2024]
కుటుంబ పరువు కోసం కోడలి గొంతుకోసి మామ హత్య చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని కొత్తపల్లి తండాలో బుధవారం చోటుచేసుకుంది. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. పోలింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. -
ఓటుకు.. తప్పని దూరాభారం
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నా.. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో తండావాసులకు ఇబ్బందిగా మారుతోంది.. -
కాంగ్రెస్కు భయపడే మోదీని తీసుకొస్తున్నారు
[ 02-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎదుర్కోవడానికి -
ఇరవై శాఖలతో.. అభ్యర్థుల ప్రచారంపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాలకు పదునుపెడుతున్నారు. -
భానుడి ప్రతాపం.. కార్మికుల బేజారు
[ 02-05-2024]
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తకి విఘాతం ఏర్పడుతోంది. -
మేమే వస్తాం.. ఓటు అభ్యర్థిస్తాం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకోవడంతో అంతటా రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఎండ 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో ఉదయం 9 గంటలకే గడప దాటలేనంతగా మండుతోంది. -
అయిదేళ్లు.. పెరిగిన ఓటర్లు 41,930
[ 02-05-2024]
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,66,836 మంది ఓటర్లు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు