ఇంటర్లో బాలికలదే పైచేయి
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలో జిల్లాకు 21వ స్థానం
వందశాతం ఉత్తీర్ణత నమోదైన సారంగాపూర్ కేజీబీవీలో విద్యార్థులను అభినందిస్తున్న అధ్యాపక బృందం
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం: ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 5,741 మంది విద్యార్థులకుగాను 3,691 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 64.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం వొకేషనల్లో 1,045 మంది పరీక్షలు రాయగా 584 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఉత్తీర్ణతలో జిల్లా ప్రథమ సంవత్సరంలో 25వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 21 స్థానం సాధించింది.
సత్తా చాటుకున్న బాలికలు
ఇంటర్ వార్షిక పరీక్షల్లో మూడేళ్ల్లుగా విద్యార్థినులదే పైచేయిగా నిలుస్తోంది. గత ఏడాది ప్రథమ సంవత్సర జనరల్ విభాగంలో బాలురు 36 శాతం ఉత్తీర్ణులైతే బాలికలు 63.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర జనరల్ విభాగంలో బాలురు 51.16 ఉత్తీర్ణులు కాగా బాలికలు 73.49, ద్వితీయ వొకేషనల్ విభాగంలో బాలురు 57.58 ఉత్తీర్ణత సాధించగా బాలికలు 68.18 ఉత్తీర్ణులయ్యారు.
తగ్గిన ఉత్తీర్ణత శాతం
గత వార్షిక పరీక్షలతో పోలిస్తే ఈసారి ఇంటర్లో ఉత్తీర్ణత తగ్గింది. 2023 ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది ప్రథమ సంవత్సరంలో జగిత్యాల జిల్లా 13వ స్థానం సాధించగా ఈసారి 25వ స్థానానికి పడిపోయింది. ద్వితీయ సంవత్సర పరీక్షల్లో గతేడాది 10వ స్థానం దక్కగా.. ఈసారి 21వ స్థానంలో నిలిచింది.
సౌకర్యాల కొరతే సమస్య
జిల్లాలో మూడేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు కొంత మేరకు తగ్గడానికి సౌకర్యాల కొరతే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధ్యాపకులున్నా గదుల కొరతతోపాటు ప్రయోగశాలల్లో సదుపాయాలు తగ్గిపోయాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కార్యాచరణ లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయాభావంతో భోజనం తీసుకురాలేక ఆకలితోనే పాఠాలు వినాల్సి రావడంతో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నారు. పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పిస్తే ఫలితాలు మరింత ఆశాజనకంగా వచ్చేవని అధ్యాపకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్