పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు.
జిల్లాలో 84,710 మందికే విద్యుత్తు జీరో బిల్లులు
న్యూస్టుడే, సిరిసిల్ల కలెక్టరేట్: వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. ప్రతి నెలా 15 లోపు సెస్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేసి జీరో బిల్లులతో పాటు ఇతర బిల్లులను జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి నెల బిల్లులను సెస్ అధికారులు జారీ చేశారు. సెస్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ప్రజాపాలనలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు 89,749 మంది ఉన్నారు. జీరో బిల్లుల జారీ పూర్తయిన రోజు నాటికి 87,703 మంది అర్హులుగా గుర్తించారు. వీరందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీరో బిల్లులు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో తప్పుల నమోదు కారణంగా కొందరికి జీరో బిల్లులు రాలేదు. దీంతో మున్సిపల్, మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకోవడంతో వాటిని సరి చేశారు. దీంతో మార్చిలో మరో 1,949 మంది అర్హులుగా తేలారు. దీంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. వీరందరికీ ఫిబ్రవరితో పాటు మార్చి నెల జీరో బిల్లులను అందజేశారు.
వేసవి ఎండల ప్రభావంతో...
గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగించిన వినియోగదారులను మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు. ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో విద్యుత్తు వినియోగం పెరిగింది. దీంతో చాలా మంది వినియోగదారులు మార్చి నెలలో గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారారు. మార్చి నెలలో మొత్తం 89,652 మంది గృహజ్యోతికి అర్హత సాధించగా, వారిలో 84,710 మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. మిగతా 4,942 మంది అర్హతను కోల్పోయారు. ఎండ తీవ్రతతో విద్యుత్ వినియోగం పెరగడంతో వీరంతా 200 యూనిట్లకు పైగా విద్యుత్తు వాడారు. దీంతో వీరు మార్చి నెల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ఎప్పుడైతే వీరు 200 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగిస్తారో అప్పుడు మళ్లీ గృహజ్యోతికి అర్హులుగా గుర్తిస్తారు. మార్చిలో గృహజ్యోతికి సబ్సిడీ రూ.3,09,83,820లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో రూ.2,90,77,737 చెల్లించగా, మార్చిలో రూ.19,06,820 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగితే లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆన్లైన్ బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు
సెస్ పరిధిలో జరగాల్సిన విద్యుత్తు వినియోగదారుల బిల్లింగ్ను ఈఆర్సీ ఉత్తర్వుల మేరకు మార్చి నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ బిల్లింగ్ సిస్టం ద్వారా నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్పీడీసీఎల్ పరిధిలో సెస్ సంస్థలో నిర్వహిస్తున్న బిల్లింగ్ను ఎక్కడ నుంచైనా చూడవచ్చు. గతంలో సెస్ పరిధిలో బిల్లింగ్ నిర్వహించడంతో ఆన్లైన్ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తే అవి ఇక్కడి సర్వర్లో బిల్లులు చెల్లించినట్లు చూపించి మైనస్ అయ్యేవి. ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ విధానం లేకపోవడంతో కొందరు వినియోగదారులు తెలియక ఆన్లైన్లో చెల్లించాలనే ఉద్దేశంతో వారి బిల్లు రసీదులోని యూఎన్వో నంబర్ను నమోదు చేయడంతో ఎన్పీడీసీఎల్లో బిల్లులు చూపించాయి. వాటిని వినియోగదారులు చెల్లించడంతో అవి ఎన్పీడీసీఎల్ ఖాతాలో జమ అవుతున్నాయి. సెస్ పరిధిలో ఆన్లైన్ లాగిన్లో బిల్లు చెల్లించినట్లు చూపకపోవడంతో మార్చి నెల బిల్లులో గత నెల చెల్లించలేనట్లు చూపి బిల్లులను జరిమానాతో అందజేశారు. అయితే ఆన్లైన్లో బిల్లులు చెల్లించిన వినియోగదారుల వివరాలను ఎన్పీడీసీఎల్ అధికారులు సెస్ కార్యాలయానికి పంపిస్తున్నారని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సెస్ అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల్లో ఏర్పాటు
సెస్ వినియోగదారులు గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఆన్లైన్లో బిల్లులు చెల్లించడానికి వారం రోజుల్లో ఏర్పాట్లు చేస్తాం. గతంలో ఆన్లైన్లో కొందరు వినియోగదారులు తెలియక చెల్లించిన బిల్లులను ఎన్పీడీసీఎల్ నుంచి తిరిగి రప్పించి వాటిని సరిచేస్తాం. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.
సూర్యచంద్రరావు, సెస్ ఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య