భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు.
నిందితుల్లో నాయకుడు కొత్త జయపాల్రెడ్డి
సహకరించిన నగరపాలక సిబ్బంది అరెస్ట్
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే : కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన దొమ్మటి యుగేందర్ 2020లో రేకుర్తిలో 711 చదరపు గజాల స్థలాన్ని ప్రతిభ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఆ భూమిలో రేకుల షెడ్డు వేసుకొని నగరపాలక సంస్థ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మ్యుటేషన్ ప్రకియలో ఉండగా 2021 మార్చి 17న 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుదగోని కృష్ణగౌడ్తోపాటు ఆయన అనుచరులు యుగేందర్ను పిలిచి ఆ భూమి తమ అధీనంలో ఉందని బెదిరించారు. రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. ఆయన డబ్బు ఇవ్వకపోవడంతో మరుసటి రోజు షెడ్డును కూల్చివేశారు. దాంతో యుగేందర్ కృష్ణగౌడ్ వద్దకు వెళ్లి రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తానని, ప్రస్తుతం కొనుగోలు చేసిన భూమి రేవోజు లక్ష్మీరాజంది అని ఆయన నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుందని చెప్పిన కృష్ణగౌడ్ గ్రామ పంచాయతీ హయాంలోది ఇంటి నంబర్, మున్సిపల్ కార్యాలయంలో మ్యుటేషన్ చేసిన ఆస్తి పన్ను పత్రాన్ని ఇచ్చారు. కొన్ని రోజులకు యుగేందర్ తన స్థలంలో బేస్మేట్ కట్టేందుకు ప్రయత్నించగా కృష్ణగౌడ్, ఫిరోజ్ఖాన్లు వచ్చి అడ్డుకున్నారు. అక్కడ మొత్తం ఎకరం భూమి కృష్ణగౌడ్, రేవోజు లక్ష్మీరాజంకు చెందినదని కరీంనగర్కు చెందిన నాయకుడు కొత్త జయపాల్రెడ్డి రూ.1.20 కోట్లకు కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. జయపాల్రెడ్డి అనుచరుడు గుర్రం రాజిరెడ్డి పేరిట భూమి ఉందని, ఆ స్థలం కావాలంటే రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. దాంతో యుగేందర్ వారికి రూ.5 లక్షలు చెల్లించారు. వారు ఇచ్చిన జిరాక్స్ పత్రాలు పరిశీలించగా రేవోజు లక్ష్మీరాజం పేరిట ఉంది నకిలీ పట్టా అని గుర్తించి మోసపోయినట్లు గ్రహించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా వారు స్పందింకపోవడంతో బాధితుడు కోర్టులో పిటిషన్ వేయగా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. దీంతో కృష్ణగౌడ్, కొత్త జయపాల్రెడ్డిలు 18వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి ద్వారా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు ఇప్పించి ఇంటి నంబర్ రద్దు చేయించారు. ఆ స్థలంలో ఎలాంటి గృహాలు లేకున్నా మున్సిపల్లో ఆర్ఐగా పని చేస్తున్న శ్రీకాంత్, బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజు ఎకరం భూమిలో షెడ్లు ఉన్నట్లు చూపించి రెవోజి లక్ష్మీరాజంకు అనుకూలంగా నివేదిక ఇచ్చి మున్సిపల్ నుంచి 14 ఇంటి నంబర్లు లక్ష్మీరాజం, కృష్ణగౌడ్, కొత్త జయపాల్రెడ్డి అనుచరులతోపాటు మరికొందరికి కేటాయించారు. ఈ పత్రాలతో రేవోజీ లక్ష్మీరాజం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో లక్ష్మీరాజం కుమారులైన పరిపూర్ణచారి, రాఘవాచారి తప్పుడు సాక్షి సంతకాలు చేశారని బాధితుడు కొత్తపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రేకుర్తికి చెందిన మహమ్మద్ ఫిరోజ్ఖాన్, గట్టుబుత్కూర్కు చెందిన కాంపెల్లి రామాంజనేయులు, మున్సిపల్ ఆర్ఐ జంకే శ్రీకాంత్, సీతారాంపూర్కు చెందిన బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. ఇదే కేసులో రేవోజు లక్ష్మీరాజం, సుధగోని కృష్ణగౌడ్, కొత్త జయపాల్రెడ్డి, కార్పొరేటర్ సుధగోని మాధవి, గుడి రమణారెడ్డి, గుర్రం రాజిరెడ్డి, రేవోజు పరిపూర్ణచారి, రేవోజు రాఘవచారిలపై కేసు నమోదు చేశారు.
మాజీ సర్పంచి, పూర్వ కార్యదర్శిపై...
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే : సరైన పత్రాలు లేకున్నా ఇంటి నంబర్లు కేటాయించారని బొమ్మకల్ మాజీ సర్పంచి పురమల్ల శ్రీనివాస్, పూర్వ కార్యదర్శి వాజిద్లపై జిల్లా పంచాయితీ శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు రూరల్ సీఐ ప్రదీప్కుమార్ తెలిపారు. 2016లో సర్పంచి శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి వాజిద్ సహకారంతో బొమ్మకల్ గ్రామ పంచాయితీ పరిధిలో సరైన పత్రాలు లేకున్నా ఇంటి నంబర్లు కేటాయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది