బియ్యం అమ్మకాల్లో గోల్మాల్
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు.
తక్కువ తూకంతో విక్రయం
బ్రాండ్ల పేరుతో మాయ
న్యూస్టుడే, హుజూరాబాద్
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. బియ్యం ప్యాకింగ్ అనుమతులు లేకుండా విక్రయిస్తూ తూకంలో మోసం చేస్తూ ప్రజలను నష్టపరిచి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలిసిన రైస్డిపోలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని బియ్యం అమ్మకాల్లో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
అనుమతులు ఏవి..
రైస్డిపోల ఏర్పాటుకు ప్యాకేజ్డ్ కమోడిటిస్ యాక్టు కింద తప్పనిసరిగా తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. బియ్యం సంచులపై బ్రాండ్ పేరు, ఎన్ని కిలోలు, ఎంఆర్పీ, తయారీ సంస్థ, చిరునామా, ప్యాకింగ్ తేదీ, చరవాణి నంబరు తదితర వివరాలు తప్పనిసరిగా ముద్రించాలి. బియ్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను విధించిన నేపథ్యంలో తప్పనిసరిగా జీఎస్టీ లైసెన్స్ తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలేవి వ్యాపారులు పాటించడం లేదు. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్క రైస్డిపోకు కూడా ప్యాకింగ్ అనుమతి లేకపోవడం గమనార్హం. హుజూరాబాద్లోని పలు రైస్డిపోల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్రాండెడ్ పేర్లు ముద్రించి బియ్యం నింపేందుకు సిద్ధంగా ఉన్న వేల ఖాళీ సంచులను తూనికల, కొలతల శాఖ అధికారులు గుర్తించారు.
వినియోగదారుల కళ్లకు గంతలు
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బీపీటీ, జైశ్రీరాం, సోనా, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ తదితర సన్న రకం బియ్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేస్తారు. కానీ తక్కువ నాణ్యత కల్గిన బియ్యాన్ని ఈ పేర్లతో ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారులు లాభం పొందుతున్నారు. స్థానికంగా పండించిన ధాన్యాన్ని మరపట్టించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ముద్రించిన సంచుల్లో బియ్యాన్ని నింపి అమ్ముతున్నారు. ఎక్కువ ధర ఉన్న సన్నాల బియ్యంలో తక్కువ ధర బియ్యాన్ని కలిపి బ్రాండెడ్ అని నమ్మించి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఆర్ఎన్ఆర్ బియ్యాన్ని జైశ్రీరాం బ్రాండ్ పేరిట సంచుల్లో ప్యాకింగ్ చేసి క్వింటాకు రూ.7,000 చొప్పున విక్రయిస్తున్నారు. దీనికితోడు బియ్యం తూకంలోనూ వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. నిజానికి ఖాళీ బియ్యం సంచి బరువు 100 గ్రాములు ఉంటుంది. 25, 26 కిలోల సంచులను తూకం వేస్తే 100 గ్రాములు అదనంగా ఉండాలి. కానీ 25 కిలోల సంచిని తూకం వేస్తే 700 గ్రాములు, అలానే 26 కిలోల సంచి కిలో 600 గ్రాములు తక్కువగా ఉంటుంది. ఈ నెల 8న, 24న తూనికలు, కొలతల శాఖ అధికారులు హుజూరాబాద్లోని నాలుగు రైస్డిపోల్లో దాడులు నిర్వహించగా ఈ తరహా మోసం బయట పడింది. సదరు దుకాణాలపై కేసులు నమోదు చేసి సుమారు రూ.3 లక్షల విలువైన 165 బియ్యం సంచులను సీజ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 12,35,810 కుటుంబాలు 70 శాతం సన్న బియ్యం వినియోగిస్తుండగా నెలకు 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిల్లర్లు, వ్యాపారుల దోపిడితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు ఏ స్థాయిలో నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
-కె.విజయసారథి, ఏసీ, తూనికలు, కొలతల శాఖ, కరీంనగర్
ఉమ్మడి జిల్లాలో బియ్యం ప్యాకింగ్ అనుమతులు ఒక్క దుకాణానికి లేవు. వినియోగదారులు కచ్చితంగా తూకం వేసిన తర్వాతే బియ్యం కొనుగోలు చేయాలి. తూకం తక్కువ ఉంటే అంతే ధర చెల్లించాలి. ఇలాంటి మోసాలపై వినియోగదారులు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే తనిఖీలు నిర్వహించి సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. ఇకపై తనిఖీలు ముమ్మరం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్