కేసీఆర్ రోడ్ షోతో భారాసలో హుషారు
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది.
గోదావరిఖని, న్యూస్టుడే : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, బాల్క సుమన్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కోలేటి దామోదర్లు ఆయన వెంట బస్సులో చౌరస్తాకు చేరుకున్నారు. అప్పటికే అంబేడ్కర్ జంక్షన్తోపాటు చౌరస్తాలో భారీగా కార్యకర్తలు నిండిపోయారు. రామగుండం నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుని కేసీఆర్కు స్వాగతం పలికారు. బస్సులోంచి కేసీఆర్ పైకి రాగానే ఒక్కసారిగా కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ముగిసే వరకు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాంగ్రెస్, భాజపాలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ ప్రసంగం సాగింది. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ఆయన కోరారు. కేసీఆర్ రోడ్షో సందర్భంగా కోలాట బృందాలు, డప్పు కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఒగ్గు డోలు కళాకారులు రోడ్షో వెంట సాగారు.
విశేషాలు
- 48 గంటల తర్వాత గొంతుతో మాట్లాడుతున్నా అంటు కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. తనపై 48 గంటల పాటు ప్రచారానికి నిషేధం విధించారు. ఎందుకు తనపై నిషేధం విధించారో ప్రజలు చూసుకుంటారని వెల్లడించారు.
- కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తానన్నారు. ఇచ్చారా అంటూ.. ప్రజలను ప్రశ్నించారు.. లేదు 2 తులాలు ఇచ్చారట. లేదు ఇచ్చారట అంటూ రెండు సార్లు వ్యంగ్యంగా అన్నారు.
- రూ.4000 పింఛను సంగతి ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
- తన ప్రసంగంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డిలపై విమర్శలు చేశారు.
- ఇక్కడికి 5 గంటలకే హెలికాప్టర్లో వచ్చినా. నిషేధం ఉండటంతో 8.30 గంటలకు బయటకు వచ్చిన అని ప్రజలకు వెల్లడించారు. చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడితే ఈసీ నిషేధం విధించింది. మరి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలు మాట్లాడే మాటలు ఈసీకి వినిపించడం లేదా అని ప్రశ్నించారు.
రోడ్ షో సాగిందిలా..
- రాత్రి 8.34 గంటలకు ఖని అంబేడ్కర్ టి జంక్షన్ వద్దకు చేరుకున్న కేసీఆర్కు నాయకులు ఘన స్వాగతం పలికారు.
- రాత్రి 8.58 గంటలకు ఖని చౌరస్తాకు చేరుకోగా జై కేసీఆర్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. 9.05 నిమిషాలకు కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. 25 నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. కొద్దిసేపు ఉర్దూలో మాట్లాడారు.
- కేసీఆర్ ప్రసంగం అనంతరం పాటలకు జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు నృత్యం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్