logo

రూ.10.88 లక్షల నగదు పట్టివేత

హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధి పరకాల అడ్డదారి చెక్‌పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్‌ తెలిపారు.

Published : 05 May 2024 04:34 IST

నగదు చూపుతున్న సీఐ రమేష్‌, సిబ్బంది

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ మున్సిపల్‌ పరిధి పరకాల అడ్డదారి చెక్‌పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్‌ తెలిపారు. 9 మంది ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును తీసుకెళ్తుండగా.. స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పట్టణ పోలీసులు, ఎస్‌ఎస్‌టీ, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని