భానుడి భగభగలు!
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు.
అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం సతమతం
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్ క్యాంపు
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రతి రోజూ జనం వడదెబ్బతో మృతి చెందుతున్నారు.. శనివారం కూడా రాష్ట్రంలోని అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదు కాగా ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డయింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్, ధర్మపురి మండలం జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 46.7, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాతక్కళ్లపల్లి 46.1, సిరిసిల్లలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు జనాన్ని ఇబ్బంది పెట్టాయి. కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 27- 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుండటం గమనార్హం. ఏప్రిల్లో ఉమ్మడి జిల్లాలో సాధారణంతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీలు పెరగగా మే మొదటివారంలో 2-6 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదవుతున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్జోన్గా పేర్కొంటుండగా ఉమ్మడి జిల్లాలోని 50 శాతానికి పైగా మండలాలు రెడ్ జోన్లోనే ఉంటున్నాయి.
జాగ్రత్తలు పాటించాలి
- డాక్టర్ శ్రీనివాస్, ఉప వైద్యాధికారి, జగిత్యాల
40 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎండలో తిరిగితే శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ దెబ్బతిని ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ఎండదెబ్బకు గురైతే శరీర ఉష్ణోగ్రత పెరగటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, నాడి వేగంగా కొట్టుకోవటం, నాలుక ఎండిపోవటం, నీరసంగా ఉండటం, తడబడటం, అపస్మారక స్థితిలోకి వెళ్లటం జరుగుతుంది. వీరిని వెంటనే నీడకు తీసుకెళ్లి కాస్త ఉపశమనం పొందిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లాలి.ఉదయం లేదా సాయంత్రం పూటనే ప్రయాణాలు సాగించాలి. ఎండలో తప్పనిసరి వెళ్తే నెత్తిన టోపీˆ, తువాలు వంటివి తప్పనిసరిగా ధరించాలి. చెవులు, ముక్కుకు వేడి గాలి తగలకుండా కప్పి ఉంచాలి. నూలు, వదులు, తెల్లటి లేతరంగు దుస్తులనే ధరించాలి. పాదచారులు గొడుగు నీడన వెళ్లాలి. ఎండలో తేలికైన పనులనే చేయాలి. నీరు అధికంగా తాగాలి. కొబ్బరి నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగవచ్చు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవద్దు. కాళ్లకు చెప్పుల్లేకుండా నడవవద్దు. టీ, కాఫీˆ, ఆల్కహాల్, సీˆ్వట్లు, చల్లని కూల్డ్రింక్స్ను తీసుకోవద్దు.
ఎండ నుంచి రక్షణగా..
ఎండదెబ్బ మనుషులకే కాదు వాహనాలను వదలడం లేదనేదానికి ఈ చిత్రమే నిదర్శనం. మండుతున్న ఎండలకు వాహనాలు వేడెక్కి సీట్లు మండిపోతున్నాయి. ప్రచండభానుడి ప్రతాపం నుంచి వాహనాలను రక్షించుకునేందుకు జగిత్యాల టవర్ ప్రాంతంలో ఇలా తట్టుసంచులతో కప్పారు.
చిత్రం: న్యూస్టుడే, జగిత్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన