బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు.
1,850 పోలింగ్ కేంద్రాలు..7,051 యంత్రాలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. కొద్ది రోజుల క్రితం ఈవీఎంలను తనిఖీలు చేసిన అధికారులు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. 42 మంది పోటీ చేయడంతో నాలుగు రోజుల క్రితం జిల్లాలకు అదనపు యంత్రాలు వచ్చాయి. వీటిని సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. రాజకీయ పార్టీల ఆమోదంతో వీటిని కూడా నియోజకవర్గాలకు తీసుకెళ్లారు.
పెరిగిన పోటీ
పెద్దపల్లి లోక్సభ ఎన్నికల్లో ఈసారి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపారు. 2014, 2019 ఎన్నికల్లో 17 మంది పోటీ పడ్డారు. దీంతో రెండు ఈవీఎంలను వినియోగించారు. ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ ప్రధాన పార్టీలతో పాటు 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులు ఉంటారు. ఈ లెక్కన రెండింటిలో 16 చొప్పున గుర్తులు ఉండగా మరో బీయూలో 10 మంది అభ్యర్థులతో పాటు ఒక నోటా మొత్తం కలుపుకొని 43 గుర్తులున్నాయి.
ఈవీఎంలు మొరాయించకుండా..
ఎన్నికల్లో వినియోగించే ప్రతి యంత్రాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలింగ్ సమయంలో మొరాయించకుండా సాంకేతిక సమస్యలను సవరించారు. యాదృచ్ఛికీకరణలో రాజకీయ పార్టీ నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా పని చేసే విధంగా యంత్రాలను సిద్ధంగా ఉంచారు. లోక్సభ పరిధిలో 1,850 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక్క యంత్రం వినియోగిస్తారు. లోక్సభ ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లు 7,051, కంట్రోల్ యూనిట్లు 2,481, వీవీప్యాట్లు 2,627ను నియోజకవర్గాలకు తరలించి పోలీసుల పహారా ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య
[ 18-05-2024]
ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు హత్యకు గురి కావడంతో బుగ్గారం మండలం గోపులాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి -
అకాల వర్షాలు.. పిడుగుపాట్లు
[ 18-05-2024]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు రైతులు మృతి చెందారు. వేములవాడకు చెందిన శ్రీనివాస్, తంగళ్లపల్లి మండలం భరత్నగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య మరణించారు. -
పని కల్పించాలని ఉపాధి కూలీల ఆందోళన
[ 18-05-2024]
పనులను అడ్డుకోవడంతో తమకు ఉపాధి లేకుండా పోతోందని, పని కల్పించాలంటూ ఉపాధిహామీ కూలీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అందోళన చేపట్టిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ మేజర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. -
పరిశ్రమలతో ప్రగతి!
[ 18-05-2024]
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ లింకేజీ రుణాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారు. రుణాలు తీసుకోవడంతోపాటు తిరిగి వాయిదాలు చెల్లించడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ప్రచారం ఎక్కువ.. ఆదాయం తక్కువ
[ 18-05-2024]
జిల్లాలోని నగర, పురపాలికల పరిధిలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పన్నులు, ఇతర రకాల ఫీజులు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. -
జిల్లా సగటు వర్షపాతం 8.8 మి.మీ
[ 18-05-2024]
జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 8.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్ మండలంలో అధికంగా 33.6 మి.మీ, చిగురుమామిడి మండలంలో తక్కువగా 2.2 మి.మీ. వాన కురిసింది. -
ఆరోగ్య మందిర్లలో సేవల విస్తరణ
[ 18-05-2024]
కరీంనగర్ జిల్లాలోని పల్లె దవాఖానాలలో(ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్) ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతోపాటు మరిన్ని సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
సర్కారు బడుల్లో సౌకర్యాలు
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో గతంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
[ 18-05-2024]
గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
అన్నదాతపై ప్రకృతి ప్రకోపం
[ 18-05-2024]
యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. -
జిల్లాకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టు పనికి అవసరమైన వస్త్రం టెస్కో పంపిణీ చేయగా జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు శుక్రవారం చేరుకుంది. -
కొత్త గనులపై సింగరేణి దృష్టి
[ 18-05-2024]
డిమాండ్కు సరిపడా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవాలని సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన