ఇదీ మా ఎజెండా
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. రాష్ట్రవ్యాప్త సమస్యలను, ప్రజల అవసరాలను అందులో చేర్చారు. కరీంనగర్ నియోజకవర్గంలో అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి స్థానిక అంశాలతో సొంత ప్రణాళిక తయారు చేసుకున్నారు. దాన్ని ఓటర్ల ముందుకు తీసుకెళ్తూ సమస్యల పరిష్కారంపై హామీ ఇస్తున్నారు. భాజపా, భారాస, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రూపొందించిన ఎన్నికల ప్రణాళికను ఇప్పటికే ఓటర్ల వద్దకు చేర్చేందుకు ‘ఇంటింటి ప్రచారం’ పేరిట తెలుగులో ముద్రించిన మ్యానిఫెస్టో ప్రతులను పంపిణీ చేస్తున్నారు. మాజీ ఎంపీ, భారాస అభ్యర్థి వినోద్కుమార్ తన హయాంలో ఉన్నపుడు నియోజకవర్గంలో చేసిన పనులు, మళ్లీ గెలిపిస్తే తన ప్రణాళికను వివరిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ, భాజపా అభ్యర్థి బండి సంజయ్ తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే ఆదరిస్తే ప్రజల మధ్య ఉంటానని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మొదటిసారి బరిలో దిగిన వెలిచాల రాజేందర్రావు కూడా తనదైన ప్రణాళికను రూపొందించుకొని ప్రచారంలో వివరిస్తున్నారు.
ప్రజల గొంతుక.. ప్రగతి కాముక'
- భాజపా అభ్యర్థి బండి సంజయ్
‘నమస్కారం... మీ బండి సంజయ్కుమార్’ అన్న పిలుపుతో మొదలుపెట్టి తాను ఎంపీగా చేసిన అభివృద్ధి వివరాలను మ్యానిఫెస్టోలో వివరించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీణ, పట్టణ రహదారుల నిర్మాణం, రైల్వే సమగ్రాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల సాధన వంటి అంశాలను పేర్కొన్నారు. రుక్మాపూర్ సైనిక పాఠశాల, ఎస్సారార్ కళాశాల, పీజీ కళాశాలకు అటానమస్ హోదా, పాఠశాలలకు ల్యాబ్ల ఏర్పాటు వంటివి వివరించారు. నిరుద్యోగుల పక్షపాతిగా ప్రశ్నించే గొంతుక, కరోనాతో పోరాటం, రైతు దీక్ష, 317 జీవోపై దీక్ష వంటి పోరాటాలను ప్రస్తావించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధే మంత్రంగా కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే తన లక్ష్యమని వివరించారు.
చేసింది చెబుతా.. కొట్లాడి సాధిస్తా
- భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్
‘దిల్లీ గద్దె మీద ఎవరున్నా కొట్లాడి కరీంనగర్ అభివృద్ధిని సాధించడం నా లక్ష్యం.’ అంటూ భారాస అభ్యర్థి వినోద్కుమార్ మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, హైద్రాబాద్, కరీంనగర్, మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట 133 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు 216 కిలోమీటర్ల జాతీయ రహదారుల మంజూరు, పనుల ప్రగతి, శాతవాహన విశ్వవిద్యాలయానికి సైన్స్ సెంటర్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు వైద్య కళాశాలలు, సింథటిక్ ట్రాక్ నిర్మాణం వంటివి గతంలో ఎంపీగా ఉన్నపుడు పూర్తి చేశానని వివరిస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రతి జిల్లాకు నవోదయ కేంద్రం, ఐసీటీ, ఐఎస్ఈఆర్, ఐపీఎం, అంత్యోదయ స్కూల్ డెవలప్మెంట్ సెంటర్, పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తానని వినోద్కుమార్ వివరిస్తున్నారు.
సమస్య మీది.. పరిష్కారం మాది
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు
‘కోహినూర్ కరీంనగర్ వెలిచాల సహాయక్. సమస్య మీది సత్వర పరిష్కారం మాది.’ నినాదంతో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 25 అంశాలతో సొంత ప్రణాళికను రూపొందించారు. కరీంనగర్ సహాయక యాప్, ఇన్నోవేషన్ డెవలప్మెంట్, కుటీర యంత్ర చేయూత, చదువు, పోటీ పరీక్షలకు శిక్షణ, బోధన నిధి, స్కిల్ శిక్షణ, జీవనోపాధి, డ్రైవింగ్ స్కూల్, గ్రామీణ గ్రంథాలయాలు తదితర అంశాలతో రంగాల వారీగా చేసే పనులపై బుక్లెట్ ముద్రించారు. వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు మహిళల సంక్షేమం, యువతకు చేయూత వంటివి సాధించి అభివృద్ధిపరంగా నియోజకవర్గాన్ని ముందుంచుతానని చెబుతున్నారు.
తమరి రాక.. మాకెంతో సంతోషం
‘వివాహానికి ఆహ్వానిస్తే మంచి మనసుతో వెళ్లి ఆశీర్వదిస్తుంటాం.. అలాంటిది మన భవితను దిద్దుకొనే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎందుకింత నిరాసక్తత కనబరుస్తున్నాం? అన్న ఆలోచనే ఈ సృజనాత్మక పిలుపునకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాంటిదే ఈ పోలింగ్ ఆహ్వాన పత్రం. ‘ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముహూర్తం.. వేదిక పోలింగ్ కేంద్రం.. విందు అయిదేళ్ల పాటు శక్తిమంతమైన ప్రజాస్వామ్య ఫలాలు..’ అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రిక అందరినీ ఆలోచింపజేస్తోంది.
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
అవిశ్రాంతంగా 26 ఉత్కంఠగా రోజులు
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు మొత్తంగా ఒకటిన్నర నెలల పాటు పరీక్షా సమయమే. నామినేషన్లు వేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకు 48 రోజుల పాటు గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైంది. 25తో నామినేషను దాఖలు గడువు ముగిసింది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ఖరారు చేశారు. అప్పటి నుంచి ప్రచారంలో మునిగిన అభ్యర్థులు ఓటరు నాడి పట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు ఓటరును ఆకట్టుకొనే యత్నం, మరోవైపు అగ్ర నేతల పర్యటనలకు ఏర్పాట్లు, జన సమీకరణ, ఇంకోవైపు ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేసుకోవడానికి తీరిక లేకుండా గడుపుతున్నారు. అంటే 26 రోజులు అవిశ్రాంతంగా కష్టపడాల్సిందే. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా 22 రోజుల తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. అప్పటివరకు అభ్యర్థులు ప్రతి రోజూ పోలింగ్ సరళిపై క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తూ గెలుపు గెలుపోటములపై అంచనాలు వేసుకోక తప్పదు.
- న్యూస్టుడే, గోదావరిఖని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
[ 19-05-2024]
మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా నారసింహుడి చందనోత్సవం
[ 19-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. -
కోడ్ ముగిస్తేనే ప్రగతి వేగిరం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర చేతిలోనే కథలు చదివేద్దాం!
[ 19-05-2024]
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. -
జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 19-05-2024]
కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. -
ఎప్సెట్లో మెరిశారు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు
[ 19-05-2024]
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. -
పీహెచ్సీ వైద్య సేవలకు నిరీక్షణ
[ 19-05-2024]
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
[ 19-05-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. -
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం
[ 19-05-2024]
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీటిమట్టం పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. -
స్కాన్ చేయండి.. నమోదు చేసుకోండి
[ 19-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 19-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. -
మధుర ఫలం.. సమస్యలతో సతమతం
[ 19-05-2024]
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. -
హైరిస్క్లో 52 శాతం మంది
[ 19-05-2024]
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్