ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు
వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు.
తెలంగాణచౌక్ (కరీంనగర్), న్యూస్టుడే: వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు. వేములవాడ ఆలయం గురించి మాట్లాడే అర్హత భారాస, కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. బుధవారం రాత్రి కరీంనగర్లో పద్మశాలీ భవన్లో జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రసాద్ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే వేములవాడ, కొండగట్టు ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా, కేంద్రం నుంచి లేఖ రాసినా నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. వేములవాడ, కొండగట్టు ఆలయాలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి నాటి కేసీఆర్ సర్కారే కారణం. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏడాదికి వంద కోట్ల చొప్పున రూ.400 కోట్లు విడుదల చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తామని రాజన్న సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్ నయా పైసా ఇవ్వలేదు. కొండగట్టు అంజన్న ఆలయానికి సైతం వంద కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు. భారాస పాలనలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టకపోగా రాజన్న ఆలయానికి వచ్చే ఆదాయాన్ని సైతం దారి మళ్లించారు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆలయాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి సహకరించాలి. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయాన్ని దేశమంతా చాటి చెప్పేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు వచ్చారనే విషయాన్ని కాంగ్రెస్, భారాస నేతలు విస్మరించడం సిగ్గు చేటు. భారాస అభ్యర్థి నాన్లోకల్ కాబట్టే వేములవాడ ఆలయాన్ని ప్రసాద్ పథకంలో పెట్టించలేకపోయారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం కాకపోయినా వినోద్కుమార్ ఏనాడూ పట్టించుకోలేదు. కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఆయన ఇప్పించలేకపోయారు. అయినా నేను కేంద్రాన్ని ఒప్పించి సేతుబంధన్ స్కీం కింద ఆర్వోబీ నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు మంజూరు చేయించా..’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే