కలిసొచ్చిన బాస్మతి... హరియాణాకు ఎగుమతి
కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
కర్షకులకు గిట్టుబాటు
న్యూస్టుడే, వీర్నపల్లి
కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తాలు, తరుగుతో సంబంధం లేకుండా పచ్చి ధాన్యాన్ని ఇంటి వద్దే అమ్ముకుంటున్నారు. దిగుబడి తక్కువగానే ఉన్న సమయంతోపాటు ధర కలిసొస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వీర్నపల్లి మండల కేంద్రంలో 40 మంది రైతులు సుమారు వంద ఎకరాలకు పైగా బాస్మతి ధాన్యం పండిస్తున్నారు. దొడ్డు రకం, సన్న రకంతో పోలిస్తే పక్షం రోజుల మందుగానే పంట చేతికొస్తుంది. దీంతో చివరి దశలో నీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం లేదని రైతులు అంటున్నారు. నాలుగేళ్లుగా సాగుతో పెట్టుబడులు పోను ఆశించిన ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మార్కెటింగ్ కోసం హరియాణాకు చెందిన ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇంటి వద్దే కాంటాలు...
యాసంగిలో సన్నరకం పండించేందుకు రైతులు అంతగా ఆసక్తి చూపరు. దొడ్డు రకం ధాన్యం పండించడంతో కొనుగోలు కేంద్రాలకు ఒక్కసారిగా ధాన్యం పోటెత్తుతున్నాయి. దీంతో కాంటాలకు అధిక సమయం పడుతుంది. తాలు తొలగించినప్పటికీ తరుగు పేరిట కొంత అనధికారికంగా తూకం పరిపాటిగా మారింది. ఈ మూస పద్ధతిని వీడి బాస్మతి సాగుకు ఇక్కడి రైతులు ముందుకొస్తున్నారు. వంగడాలను హరియాణా నుంచి తెచ్చుకుని ఇక్కడ సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన మూడు రోజుల్లోపే ఇంటివద్దే పచ్చిగాఉన్నధాన్యాన్ని సైతం తూకాలు వేస్తున్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని కర్షకులు చెబుతున్నారు. తాలు తరుగు సాకుతో కోతలు విధించడం లేదు. అలాగే హమాలీ డబ్బులను సైతం సదరు వ్యక్తులే చెల్లిస్తున్నారు. రూ. 2,600 ధర పలుకుతుందని అన్నదాతలు పేర్కొంటున్నారు. తూకం వేసిన 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమవుతున్నాయి.
నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా
- పతారి పద్మయ్య, వీర్నపల్లి
నాలుగేళ్ల క్రితం ఓ వ్యక్తి సలహాతో ఇక్కడ బాస్మతి సాగు చేశాను. నాతోపాటు ఇరుగు పొరుగు రైతులు సైతం పంటను వేశారు. ఇంటి వద్దకే వచ్చి కాంటాలు వేస్తున్నారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో 70 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. తూకం వేసిన రెండు రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమవుతున్నాయి. బాస్మతి సాగుతో మాకు బాగానే గిట్టుబాటు అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే