సింగరేణి కార్మికుల మొగ్గు ఎటు?
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థుల ప్రయత్నాలు
న్యూస్టుడే, గోదావరిఖని
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలో అత్యధికంగా ఉన్న సింగరేణి కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపితే ఫలితం అటువైపే ఉంటుందన్నది అభ్యర్థుల ప్రగాఢ విశ్వాసం. దీంతో లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరులు సైతం వారి ఆదరణ పొందేందుకు దృష్టి సారించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండటంతో ఈలోగా వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా కార్మికులు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మొత్తం అదే సరళి ఉంటుండగా ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నది అంతుచిక్కడం లేదు. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో అయిదు నియోజకవర్గాలు పూర్తిగా సింగరేణి ప్రాంతాల్లోనే ఉన్నాయి. రామగుండం నియోజకవర్గం పరిధిలో ఆర్జీ-1, 2 డివిజన్లు, మంథని నియోజకవర్గం పరిధిలో ఆర్జీ-3 డివిజన్, మంచిర్యాలకు శ్రీరాంపూర్, చెన్నూరులో మందమర్రి, జైపూర్ ప్లాంటు, బెల్లంపల్లి అసెంబ్లీ స్థానానికి బెల్లంపల్లి డివిజన్లు వస్తాయి. మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాల్లో 28,829 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు కలిపితే కనీసం 1.80 లక్షల ఓట్ల వరకు ఉంటాయి. మెజారిటీ ఓట్లు ఎవరికి పడితే వారినే విజయం వరించే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఎక్కువ శాతం సింగరేణి కార్మికులపై దృష్టి సారించారు.
కొత్త గనులతోనే ఉపాధి అవకాశాలు
సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటు చేయక చాలా సంవత్సరాలవుతోంది. ప్రస్తుతం కొత్తగా విధించిన నిబంధన ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారానే గనులను దక్కించుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న గనులన్నీ పాతవి కావడంతో కొద్ది కాలంలోనే అందులో నిక్షేపాలు పూర్తయ్యే పరిస్థితి ఉంది. గనులు మూసివేసే క్రమంలో ఉపాధి అవకాశాలు సైతం సన్నగిల్లుతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావాలంటే నూతన గనులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో కొత్తగా ప్రతిపాదనలో ఉన్న గనులు 10 వరకు ఉన్నాయి. వీటిని ప్రారంభించుకుంటే కనీసం 10 వేల మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. కొత్త గనులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రస్తుతం కోల్బెల్టు ప్రాంతంలో ఉంది. గనులుంటేనే నియోజకవర్గం పరిధిలో ఓటర్లు ఉండే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో కొత్త గనుల ఏర్పాటు అత్యవసరంగా మారింది.
- కోల్ ఇండియాలో ఆర్థిక ప్రయోజనాలపై వర్తించే ఆదాయ పన్నును యాజమాన్యం భరిస్తుంది. అదే విధంగా సింగరేణిలో సైతం యాజమాన్యం భరించే విధంగా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ ఇక్కడి కార్మికుల్లో ఉంది. కార్మికులు సంపాదించిన మొత్తంలో 30 శాతం వరకు ఆదాయ పన్ను కిందే చెల్లించాల్సి వస్తుంది. దీనిని నివారించేందుకు కొంత వరకైనా మినహాయింపునిస్తే బాగుంటుందన్న అభిప్రాయం నెలకొంది.
- కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కోల్ ఇండియాలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఇది వర్తింపజేస్తున్నారు. సింగరేణిలో అమలు చేయడం లేదు. దీనిపై అనేక సార్లు కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేశారు. జేబీసీసీఐ సమావేశాల్లో చర్చించారు. ఇప్పటి వరకు ఈ అంశంపై ముందడుగు పడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే