గజిబిజిగా ఓటరు జాబితా
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది.
సరిదిద్దకుండానే పోలింగ్కు..
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
- వావిలాలపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన ఓటర్లు అంబేడ్కర్ రోడ్డు, క్రిస్టియన్ కాలనీలో ప్రత్యక్షమయ్యారు. జాబితాలో ప్రకారం ఇంటి నంబర్లు అక్కడికి ఉండటంతో పోల్చీటీలు కూడా అక్కడే పంపిణీ చేసే అవకాశముంది.
- బూత్లలో ఓటర్ల కేటాయింపు సక్రమంగా చేయకపోవడంతో ఒక బూత్లో 487 ఓట్లు ఉండగా, మరో బూత్లో 1489 ఓట్లు ఉన్నాయి. ఓటేసే సమయంలో ఒక దానిలో రద్దీ ఉండనుంది. రెండింటిలో సమానంగా నిర్ణయించలేదు. నగరవ్యాప్తంగా అత్యధిక శాతం పోలింగ్ కేంద్రాలలో ఇలాగే ఉన్నాయి.
- ఇంటినంబర్ ప్రకారం కుటుంబ సభ్యులందరివి ఒకే పోలింగ్ స్టేషన్లోని ఒకే బూత్లో ఉండాలి. అలాకాకుండా భార్య, భర్త, పిల్లల ఓట్లు వేర్వేరు చోట ఉన్నాయి.
- కాపువాడ, పాతబజారు, పద్మశాలీ వీధిలో ఉన్న ఓటర్లు మారుతినగర్లోని ఓటరు జాబితా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక కొందరు ఓటేసేందుకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది. వారం రోజులుగా ఓటర్లను కలుసుకునేందుకు ఆయా ప్రధాన పార్టీల నాయకులు బూత్ కమిటీల వారీగా ఇంటింటికి వెళ్తున్నారు. కొందరి పేర్లు ఉండి, మరికొందరివి కనిపించకపోవడంతో ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. మిగతా ఓట్లు ఏ బూత్లో ఉన్నాయో తెలుసుకొని చెబుతామని చెప్పి సదరు పార్టీల బాధ్యులు అక్కడి నుంచి జారుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాగే ఓటర్ల జాబితా గందరగోళంగా ఉండగా, ప్రస్తుతం కూడా అలాగే ఉందని కార్పొరేటర్లు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మార్పులు, చేర్పులు ఉంటాయని భావించిన రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు ఎప్పటిలాగే దర్శనమిచ్చాయి. ఈ ఓటరు జాబితా ఎప్పుడు మారుతుందో ఆ అధికారులే తెలియాలంటున్నారు.
ఎప్పటిలాగే ప్రత్యక్షం..
పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా లేకపోవడం ఒక కారణమైతే, సమీప బూత్లలో ఉన్న ఓటర్లు కాకుండా ఇతర బూత్లకు సంబంధించిన వారు ఉన్నారు. ఇంటి నంబర్లు, వీధుల పేర్లు ఎక్కడో తెలియకుండా మారింది. కొన్నింటికి అయితే రెండు అంకెల ఇంటి నంబర్లు ఉండటంతో ఏ డివిజన్ ఓట్లు అనేవీ తేల్చుకోలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఉన్నట్లే ఇంటినంబర్ల స్థానంలో సర్వే నంబర్లు ఉన్నాయి. మరికొందరికి బిల్డింగ్ అని ఉంది. ఇలాంటి వాటిని రెవెన్యూ అధికారులు పరిశీలించి మార్చకపోవడంతో అలాగే జాబితాలో ముద్రితమవుతున్నాయి.
అదనంగా అయిదు కేంద్రాలు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 390 పోలింగ్ కేంద్రాలు ఉండగా, లోక్సభ ఎన్నికల కోసం అదనంగా అయిదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రూరల్ మండలంలో దూరంగా ఉన్న వాటిని ఓటర్ల దగ్గరికి మార్చినట్లు సమాచారం. ఇంకా 19 పోలింగ్ కేంద్రాలను అటు ఇటుగా మార్చారు. వీటిని ఓటర్లు దగ్గర ఉన్న ప్రాంతానికి విభజించారు. ఓటరు చీటీలో పోలింగ్ కేంద్రం, చిరునామా, రూట్ మ్యాప్ ప్రచురించి ఇచ్చారు. దాని ఆధారంగా ఓటర్లు పోలింగ్ రోజున ఓటు వేసే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు సరఫరాలో అంతరాయం
[ 19-05-2024]
మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా నారసింహుడి చందనోత్సవం
[ 19-05-2024]
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాల్లో శనివారం స్వామి వారికి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సన్నద్ధం
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. -
కోడ్ ముగిస్తేనే ప్రగతి వేగిరం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ స్థానాల పరిధిలో కలెక్టర్ మొదలు కింది స్థాయి ఉద్యోగి వరకు లోక్సభ ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. -
ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్ చేసినట్లు డీఈవో జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అర చేతిలోనే కథలు చదివేద్దాం!
[ 19-05-2024]
వేసవి సెలవులను పిల్లలు ఆనందంగా గడుపుతుంటారు. రోజులో కొంత సమయాన్ని నైపుణ్య పెంపు, లేదా వికాస వృద్ధికి కేటాయిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఇంటింటా కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ ఏదో ఒకటి ఉంటున్న నేపథ్యంలో పఠనా నైపుణ్యాలు పెంచే వెబ్సైట్లు రూపుదిద్దుకున్నాయి. -
జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 19-05-2024]
కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. -
ఎప్సెట్లో మెరిశారు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు, ఆ ప్రాంతానికి పేరు తీసుకొచ్చారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు
[ 19-05-2024]
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. -
పీహెచ్సీ వైద్య సేవలకు నిరీక్షణ
[ 19-05-2024]
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. పేరుకు 24 గంటల ఆసుపత్రి అయినా.. కనీసం పగటిపూట కూడా ఎవరూ ఉండటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి
[ 19-05-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రానికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. -
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం
[ 19-05-2024]
ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీటిమట్టం పడిపోయింది. డెడ్ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. -
స్కాన్ చేయండి.. నమోదు చేసుకోండి
[ 19-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడటం, వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజురోజుకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఓపీ నమోదు కోసమే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 19-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. -
మధుర ఫలం.. సమస్యలతో సతమతం
[ 19-05-2024]
మధుర ఫలమైన మామిడిని పండిస్తున్న రైతులకు చేదుఫలితాలే మిగులుతున్నాయి. మన మామిడికాయలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండున్నా ఏటికేడు పెరుగుతున్న చీడపీడలకు తోడుగా కాయల విక్రయంలోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున అసంపూర్తిగానే మామిడిసాగును కొనసాగిస్తున్నారు. -
హైరిస్క్లో 52 శాతం మంది
[ 19-05-2024]
జీవనశైలిలో మార్పులతో కుటుంబంలో ఎవరూ ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు