ఓటు రాజ్యాంగం హక్కు
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు హక్కు అని జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి విద్యార్థులకు సూచించారు.
మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి
బళ్లారి, న్యూస్టుడే: రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు హక్కు అని జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి విద్యార్థులకు సూచించారు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ సరళాదేవి సతీశ్చంద్ర అగర్వాల్ డిగ్రీ కళాశాల సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన ‘విశేష సంక్షిప్త పరిష్కరణె-2023’ కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి ప్రారంభించి మాట్లాడారు. మన ఓటు- మన హక్కు అని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. యువతకు అవగాహన కల్పించడానికి డిసెంబరు 9న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువ ఓటర్లు ఎలాంటి వాటికి లొంగకుండా నిర్భయంగా ఓటు వేసి ప్రజాప్రభుత్వం పటిష్టం చేయాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ఇతరలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా పోలీస్ అధికారి రంజిత్కుమార్ బండారు, జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, అదనపు జిల్లా పాలనాధికారి మంజునాథ, అసిస్టెంట్ కమిషనర్ హేమంత్, శిక్షణ ఐ.ఎ.ఎస్ అధికారి రోపిందర్ కౌర్, తహసీల్దార్ విశ్వనాథ, ప్రధాన ఆచార్యులు మంజునాథరెడ్డి, లీడ్ కళాశాల నిర్వహకులు డా.జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశ్నలు ఇంకా అడుతుండగా డీసీ ఈసీ, ఏడీసీకి దిశా సమావేశం ఉండటంతో వెళ్లి పోయారు.
చెళ్లకెరె(చిత్రదుర్గం): ఓటర్లలో జాగృతి పెంపొందించడానికి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఓటరు అక్షరాస్యతా పోటీలను నిర్వహించారు. శనివారం ఇక్కడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోటీలను జిల్లా నోడల్ అధికారి పరశురామప్ప ప్రారంభించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కారక్రమంలో బీఈఓ తిప్పేస్వామి, ప్రధానోపాధ్యాయురాలు ఆశారాణి, రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?