logo

భాజపాకు మిగిలేది చెంబు: డీకే

కన్నడిగులకు ఖాళీ చెంబు ఇచ్చిన భాజపాకు ఈసారి ఓటు వేయకుండా ఖాళీ చెంబు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 04:29 IST

తమ అభ్యర్థి వినోద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్న డీకే

ధార్వాడ, న్యూస్‌టుడే : కన్నడిగులకు ఖాళీ చెంబు ఇచ్చిన భాజపాకు ఈసారి ఓటు వేయకుండా ఖాళీ చెంబు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు. ధార్వాడ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా కుందగోళలో శనివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన భాజపా నేతలు ఒక బుట్ట నిండా వేపాకు, ఖాళీ చెంబు మాత్రమే కన్నడిగులకు ఇచ్చారని విమర్శించారు. ఇచ్చిన మాటను కాషాయ పార్టీ ఎన్నడూ నిలుపుకోలేదన్నారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన ఐదు గ్యారంటీల హామీలనూ అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నన్ని రోజులూ ఈ గ్యారంటీలను కొనసాగిస్తామని చెప్పారు. లోక్‌సభకు ఇక్కడి నుంచి పలుసార్లు ఎన్నికైన ప్రహ్లాద్‌ జోషి ప్రజలకు చేసిన మేలేమీ లేదన్నారు. పార్టీ నాయకులు సలీం అహ్మద్‌, నారాయణ స్వామి, ఏసీ శ్రీనివాస్‌, కుసుమా శివళ్లి, యతీంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని