logo

డీకేను కించపరచిన ముగ్గురిపై కేసు

పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కించపరిచేలా వివిధ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులపై బెంగళూరు హైగ్రౌండ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 06 May 2024 05:20 IST

బెంగళూరు (యలహంక): పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కించపరిచేలా వివిధ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారనే ఆరోపణపై ముగ్గురు వ్యక్తులపై బెంగళూరు హైగ్రౌండ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. డీకే మద్దతుదారు హరీశ్‌ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నెలమంగలకు చెందిన రాజీవ్‌గౌడ, కేసరి, సామ్రాట్‌ అనే వ్యక్తులపై అభియోగాలు మోపారు. ఇతరు చిత్రాలకు డీకే ముఖరూపాన్ని అంటించి- వ్యంగ్యంగా మార్చి.. వీడియోలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. భాజపా నేతలు కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని