logo

ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపం

ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్‌.దివాకర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Published : 06 May 2024 05:21 IST

ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

హొసపేటె, న్యూస్‌టడే: ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్‌.దివాకర్‌ ఆదేశాలు జారీ చేశారు. హగరిబొమ్మనహళ్లి తాలూకా పంచాయతీ గుమస్తా అందానగౌడ మల్కిపాటిల్‌ను అదే తాలూకాలోని పోలింగ్‌ కేంద్రం-151కు అధికారిగా,  ప్రభుత్వ కళాశాల ఉపన్యాసకురాలు ఎస్‌.ఆర్‌.సుధాను పోలింగ్‌ కేంద్రం-216 అధికారిగా నియమించినా విధులకు హాజరుకాకుండా కర్తవ్య లోపం చేశారు. కూడ్లిగి తాలూకా పోలింగ్‌ కేంద్రం సంఖ్య-46కి అధికారిగా హొసపేటె ఉపాధ్యాయుడు ప్రశాంత్‌ను నియమించారు. ఆయన కూడా విధులకు హాజరుకాకుండా కర్తవ్య లోపానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ డీసీ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని