దారితప్పిన కరవు పరిహారం: అశోక్
కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది.
మాట్లాడుతున్న విపక్ష నేత అశోక్
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : కేంద్రం విడుదల చేసిన కరవు పరిహారాన్ని రైతులకు పంపిణీ చేయకుండా అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నట్లు భాజపా ఆరోపించింది. బెంగళూరులోని భాజపా మాధ్యమ ప్రచార కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విపక్ష నేత అశోక్, ఎమ్మెల్యే రవిసుబ్రహ్మణ్యం తదితరులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతుల బ్యాంకు ఖాతాలకు తక్షణమే పరిహారాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బంది పడుతున్నా, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. భాజపాను విమర్శిస్తూ తప్పుడు ప్రకటనలు, కాలహరణ చేస్తున్నట్లు నిప్పులు చెరిగారు. రైతులు పరిహారాన్ని అడిగితే, మీ ఇంటి యజమానురాలికి ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పలు జిల్లాల్లో పశువుల మేతకు, తాగునీటికి కొరత ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అధికారులు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రాధికారలకు తమ ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వెనక్కు తీసుకుని ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను కేరళ ముఖ్యమంత్రి అమూల్ బేబీ అన్నారని, వయనాడ్లో ఓడిపోతానన్న భయంతో రాయ్బరేలీలోనూ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే భయమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిట్ అదుపులో దేవరాజేగౌడ
[ 18-05-2024]
భాజపా నాయకుడు, న్యాయవాది దేవరాజేగౌడను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అదుపులోనికి తీసుకుంది. హొళెనరసీపుర ఠాణా పోలీసుల విచారణ పూర్తి కావడంతో ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దేవరాజేగౌడ నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని సిట్ తరఫు న్యాయవాది కోరడంతో శనివారం వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. -
అన్నదాతలకు వెన్నుదన్ను
[ 18-05-2024]
కరవు పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ముంగారులో సహకారం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి సాధ్యం కావడం లేదు. -
కొత్త చట్టాలకు పదును
[ 18-05-2024]
దేశవ్యాప్తంగా ఐపీసీ, సీఆర్పీసీతో పాటు పలు చట్టాల్లో మార్పులు వచ్చాయని నగర పోలీసు కమిషనర్ వి.దయానంద్ వెల్లడించారు. జులై ఒకటి నుంచి ఆ చట్టాలు అమలులోకి వస్తాయని వివరించారు. రాజధాని నగరంలోని ఆడుగోడి దక్షిణ సీఏఆర్ మైదానంలో సిబ్బంది నుంచి ఆయన శుక్రవారం గౌరవ వందనాన్ని అందుకున్నారు. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
[ 18-05-2024]
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
అప్ప విచారణకు చర్యలు?
[ 18-05-2024]
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరేందుకు కార్ప్స్ ఆఫ్ డిటెక్టివ్ (సీఓడీ) అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
ప్రజ్వల్ ఎక్కడున్నా రప్పిస్తాం..
[ 18-05-2024]
లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. -
కవీంద్రుడి కలల తీరం!
[ 18-05-2024]
అపూర్వం.. అద్భుతం.. అమోఘం.. మహా సుందరం.. అనే పదాలన్నీ అచ్చుగుద్దినట్లు రవీంద్రనాథ్ఠాగూర్ తీరానికి సరిపోతాయి. కార్వార సమీపంలో విస్తరించిన అరేబియా సముద్ర తీరానికి మన కవీంద్రుడి పేరుపెట్టి.. ప్రస్తుతం చక్కగా విస్తరించి పర్యాటకులకు అనువుగా మార్చారు. -
పరిషత్ పోరుకు కూటమి ముందడుగు
[ 18-05-2024]
విధానపరిషత్తు ఎన్నికల్లో భాజపా, జనతాదళ్ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలూ వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ టీఏ శరవణ పిలుపునిచ్చారు. భాజపా, జనతాదళ్ నాయకులతో కలిసి జయనగరలోని ఒక హోటల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తుమకూరు దిశగా మెట్రో చూపులు
[ 18-05-2024]
రాజధాని నగర నాజూకు ప్రయాణ వ్యవస్థ ‘నమ్మ మెట్రో’ ఉత్తర-దక్షిణ కారిడార్ మార్గం రూపుదాల్చుతోంది. ఈ మార్గం పరిధిలో కీలకమైన నాగసంద్ర- అంతర్జాతీయ వస్తు ప్రదర్శన శాల (బీఐఈసీ) మధ్య 3.7 కిలోమీటర్ల ఉపరితల వంతెనపై జులై ఆఖరు నాటికే రైలు పరుగులు తీయనుందని అధికారులు ప్రకటించారు. -
రౌడీషీటరుపై కాల్పులు
[ 18-05-2024]
పేరొందిన రౌడీషీటరు నరసింహమూర్తి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ మిట్టెపై దొడ్డబళ్లాపుర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. హేమంత్ కుమార్ గౌడ (27) అనే వ్యక్తిని హత్య సేసి పరారీలో ఉన్న శ్రీనివాస్ యలహంక తాలూకా శ్రీరామనహళ్లి సమీపాన ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు.