logo

బెంగళూరులో తెదేపా ప్రచారం

అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.

Published : 07 May 2024 03:18 IST

తెదేపాకు మద్దతుగా సమావేశమైన కార్యకర్తలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు. బెంగళూరులో ఉంటున్న తెదేపా నాయకులు మల్లేశ్వరరావు, రాఘవయ్య, సుబ్రహ్మణ్య నాయుడు, రేపన నాగరాజు, దేవరింటి ఎల్లయ్య, డేరంగుల నాగరాజ తదితరులు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డిని గెలిపించుకోవలసిన అవసరాన్ని నేతలు గుర్తుచేశారు. ఎన్నికలకు రెండు రోజులు ముందుగానే నియోజకవర్గానికి చేరుకునేలా ఇక్కడ స్థానికులకు జాగృతి కల్పిస్తున్నామని స్థానిక నాయకులు దాము, లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని