ఓటరన్నకు పండగొచ్చె!
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది
భారమంతా మీదేనండీ.. కొప్పళలో ఉద్యోగినుల సేవలు
బెెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అన్ని పోలింగ్ బూత్లకు ఈవీఎం, వీవీ ప్యాట్ తదితర సరంజామాతో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన బూత్లకు చేరుకున్నారు. సిబ్బందిని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన నియోజకవర్గాల నుంచి కొన్ని బస్సులను తరలించారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి బూత్ పరిధిలో పోలీసులు, భద్రత సిబ్బందిని కేటాయించారు. ఆయా నియోజకవర్గాల కీలక బూత్లను జిల్లాధికారులు పరిశీలించారు. మహిళా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా సఖీ బూత్లను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతం కన్నా ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు, నాయకుల అంచనా. బెంగళూరుతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలకు ఓటర్లు వెళ్లేందుకు ఆర్టీసీ, నైరుతి రైల్వే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.బీదర్తో కనీసం 80 శాతం పోలింగ్ నమోదు చేయాలనేది లక్ష్యమని జిల్లాధికారి గోవిందరెడ్డి తెలిపారు. దావణగెరె లోక్సభ పరిధిలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఉమా ప్రశాంత్ పర్యవేక్షించారు. కలబురగి నియోజకవర్గంలో 493 బూత్లలో వెబ్కాస్టింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అన్ని పోలింగ్ బూత్ల వద్ద అత్యవసర వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది, అంబులెన్సు, తాగునీరు, ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు షామియానాలు, వెయిటింగ్ రూమ్, మరుగుదొడ్డి తదితర సదుపాయాలు కల్పించారు.
కలబురగిలో ఈవీఎం యంత్రాన్ని మోసుకెళుతున్న ఓ ఉద్యోగిని
ః ఈ ఎన్నికల్లో 2,59,17,193 మంది ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, అందులో 1,29,66,570 మంది మహిళలు, 1,29,48,978 మంది పురుషులు, 1945 మంది తృతీయలింగ పౌరులు ఉన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే 3.78 లక్షల మంది యువకులు, 3.12 లక్షల మంది యువతులు ఉన్నారు. బీవై రాఘవేంద్ర, గీతా శివరాజ్ కుమార్, ఈశ్వరప్ప, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్ శెట్టర్, బసవరాజ బొమ్మై, మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ, మంత్రుల సంతానం మృణాల్ హెబ్బాళ్కర్, సాగర్ ఖండ్రే, సంయుక్త పాటిల్, ప్రియాంక జార్ఖిహొళి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్సభ సభ్యుడు భగవంత ఖూబా, మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 206 మంది పురుషులు, 21 మంది మహిళలతో కలిపి 227 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, యడియూరప్ప, సదానందగౌడ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ప్రచారాన్ని నిర్వహించిన క్రమంలో.. పోలింగ్ భారీగా నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిట్ అదుపులో దేవరాజేగౌడ
[ 18-05-2024]
భాజపా నాయకుడు, న్యాయవాది దేవరాజేగౌడను ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అదుపులోనికి తీసుకుంది. హొళెనరసీపుర ఠాణా పోలీసుల విచారణ పూర్తి కావడంతో ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. దేవరాజేగౌడ నుంచి మరిన్ని వివరాలను రాబట్టాలని సిట్ తరఫు న్యాయవాది కోరడంతో శనివారం వరకు విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. -
అన్నదాతలకు వెన్నుదన్ను
[ 18-05-2024]
కరవు పరిస్థితులతో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ముంగారులో సహకారం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో అధికారులతో సమావేశాలు నిర్వహించడానికి సాధ్యం కావడం లేదు. -
కొత్త చట్టాలకు పదును
[ 18-05-2024]
దేశవ్యాప్తంగా ఐపీసీ, సీఆర్పీసీతో పాటు పలు చట్టాల్లో మార్పులు వచ్చాయని నగర పోలీసు కమిషనర్ వి.దయానంద్ వెల్లడించారు. జులై ఒకటి నుంచి ఆ చట్టాలు అమలులోకి వస్తాయని వివరించారు. రాజధాని నగరంలోని ఆడుగోడి దక్షిణ సీఏఆర్ మైదానంలో సిబ్బంది నుంచి ఆయన శుక్రవారం గౌరవ వందనాన్ని అందుకున్నారు. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
[ 18-05-2024]
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
అప్ప విచారణకు చర్యలు?
[ 18-05-2024]
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరేందుకు కార్ప్స్ ఆఫ్ డిటెక్టివ్ (సీఓడీ) అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
ప్రజ్వల్ ఎక్కడున్నా రప్పిస్తాం..
[ 18-05-2024]
లైంగిక దౌర్జన్య సంఘటనలకు సంబంధించి హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విదేశాల నుంచి తీసుకొచ్చేందుకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ తెలిపారు. -
కవీంద్రుడి కలల తీరం!
[ 18-05-2024]
అపూర్వం.. అద్భుతం.. అమోఘం.. మహా సుందరం.. అనే పదాలన్నీ అచ్చుగుద్దినట్లు రవీంద్రనాథ్ఠాగూర్ తీరానికి సరిపోతాయి. కార్వార సమీపంలో విస్తరించిన అరేబియా సముద్ర తీరానికి మన కవీంద్రుడి పేరుపెట్టి.. ప్రస్తుతం చక్కగా విస్తరించి పర్యాటకులకు అనువుగా మార్చారు. -
పరిషత్ పోరుకు కూటమి ముందడుగు
[ 18-05-2024]
విధానపరిషత్తు ఎన్నికల్లో భాజపా, జనతాదళ్ కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలూ వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ టీఏ శరవణ పిలుపునిచ్చారు. భాజపా, జనతాదళ్ నాయకులతో కలిసి జయనగరలోని ఒక హోటల్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
తుమకూరు దిశగా మెట్రో చూపులు
[ 18-05-2024]
రాజధాని నగర నాజూకు ప్రయాణ వ్యవస్థ ‘నమ్మ మెట్రో’ ఉత్తర-దక్షిణ కారిడార్ మార్గం రూపుదాల్చుతోంది. ఈ మార్గం పరిధిలో కీలకమైన నాగసంద్ర- అంతర్జాతీయ వస్తు ప్రదర్శన శాల (బీఐఈసీ) మధ్య 3.7 కిలోమీటర్ల ఉపరితల వంతెనపై జులై ఆఖరు నాటికే రైలు పరుగులు తీయనుందని అధికారులు ప్రకటించారు. -
రౌడీషీటరుపై కాల్పులు
[ 18-05-2024]
పేరొందిన రౌడీషీటరు నరసింహమూర్తి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ మిట్టెపై దొడ్డబళ్లాపుర పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. హేమంత్ కుమార్ గౌడ (27) అనే వ్యక్తిని హత్య సేసి పరారీలో ఉన్న శ్రీనివాస్ యలహంక తాలూకా శ్రీరామనహళ్లి సమీపాన ఉన్నట్లు గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్