logo

మహిళలకు సిద్ధు లేఖ

కర్ణాటకలో రెండో విడత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు.

Published : 07 May 2024 03:38 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: కర్ణాటకలో రెండో విడత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు, గ్యారంటీలను వివరిస్తూ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ‘నా ప్రియమైన తల్లులారా.. అక్కచెల్లెళ్లారా.. 18వ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపు-ఓటములు మాత్రమే కాదని, మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గెలుపోటములను కూడా నిర్ణయించేది. మహిళలు స్వాతంత్య్రానికి అర్హులు కాదని మనుధర్మాన్ని పాటించే భాజపాకు, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలనేది లక్ష్యం’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని