logo

తలుపులు వేసుకుని..

హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు.

Published : 08 May 2024 02:03 IST

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు. సుమారు 20 నిమిషాలు బూత్‌ను మూసి వేయడంతో సాయంత్రం అదనంగా మరో 20 నిమిషాలు సమయం ఇవ్వాలంటూ కొందరు ఓటర్లు డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ ప్రక్రియను నిలపకుండా భోజన విరామానికి వంతుల వారీగా వెళ్లి రావలసిన విధానాన్ని సిబ్బంది ఉల్లంఘించారని స్థానికులు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని