మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ బి.రోహిత్రాజు
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం ములకలపల్లి అటవీ ప్రాంతంలో జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్లు గురువారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కిష్టారం ఎల్ఓఎస్ డిప్యూటీ కమాండర్ పుట్టం మున్నా అలియాస్ సన్నాల్ (35), ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన మావోయిస్టు కొరియర్ జాడి పెద్దబ్బాయి (26) పట్టుబడ్డారు. వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మున్నా 2004 నుంచి ఆయుధ దళం సభ్యుడిగా పని చేస్తున్నాడు. అప్పట్నుంచి గంగలూరు ఏరియా మిలీషియా సభ్యుడిగా, ఏరియా కమిటీ దళ సభ్యుడిగా, పామేడు ఏరియా కమిటీ దళ సభ్యుడిగా, 2011 నుంచి 2022 మధ్య మడవి హిడ్మా అలియాస్ సంతోశ్ నాయకత్వంలో మావోయిస్టు బెటాలియన్ సభ్యుడిగా పనిచేశాడు. రెండేళ్లుగా కిష్టారం ఏరియా ఎల్ఓఎస్ డిప్యూటీ దళ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. ఎస్ఎల్ఆర్ ఆయుధంతో తిరుగుతూ ఇతర మావోయిస్టు దళ సభ్యులతో కలిసి పలు విధ్వంసకర ఘటనల్లో అతడు పాల్గొన్నాడు. 2007లో తాడిమెట్ల వద్ద 12 మంది సీఆర్పీఎఫ్, 2010లో చింతల్నార్ అటవీ ప్రాంతంలో మరో 76 మంది జవాన్లను హతమార్చిన ఘటనల్లో ఈయన నిందితుడు. 2013లో కిష్టారం వద్ద బలగాలపై జరిగిన దాడిలో, 2014లో మైన్ప్రూఫ్ వెహికిల్పై కాల్పులు జరిపి తొమ్మిది మంది జవాన్లను హతమార్చిన ఘటనలోనూ మున్నా పాల్గొన్నాడు. ఇవికాకుండా వేర్వేరు దాడుల్లో పాల్గొని 27 మంది జవాన్ల మృతికి కారణమైన వారిలోనూ ఆయన ఒకడు. పెద్దబ్బాయి గత మూడేళ్లుగా ఛత్తీస్గఢ్కు చెందిన ఫస్ట్ బెటాలియన్ మావోయిస్టులకు కొరియర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి వద్ద ఒక బ్యాగు, పది జిలెటిన్ స్టిక్స్, రెండు ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, మావోయిస్టు కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అమాయక ఆదివాసీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ సాయి మనోహర్, దుమ్ముగూడెం సీఐ బి.అశోక్, 151 బెటాలియన్ డిప్యూటీ కమాండర్ ప్రదీప్సింగ్ షెకావత్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం