logo

తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్‌

ఖమ్మం లోక్‌సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఆదార్‌) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్‌ నామపత్రాలను ఆర్‌ఓ గౌతమ్‌కు అందజేశారు

Published : 19 Apr 2024 03:03 IST

 ఖమ్మం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు బీ-ఫాం అందజేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, చిత్రంలో ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి పువ్వాడ తదితరులు
ఖమ్మం నగరం, వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఆదార్‌) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్‌ నామపత్రాలను ఆర్‌ఓ గౌతమ్‌కు అందజేశారు. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి ఆదార్‌ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లికి చెందిన అంబోజు బుద్ధయ్య నామినేషన్‌ వేశారు.

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం, మహబాబాబాద్‌ లోక్‌సభ స్థానాల భారాస అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవితకు ఆపార్టీ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌లో బీ-ఫాంలను గురువారం అందజేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కూరాకుల నాగభూషయ్య, గుండాల కృష్ణ పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని