logo

సింగరేణిలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి

ప్రస్తుత వార్షిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరిగింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు 92 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి.

Published : 01 May 2024 02:15 IST

మొదటి నెలలో 92శాతం

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ప్రస్తుత వార్షిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరిగింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు 92 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి. మంగళవారం ఉదయానికి సింగరేణి వ్యాప్తంగా 20,20,481 టన్నులకు గాను 19,44,370 టన్నుల బొగ్గు వెలికితీశారు. అన్ని ఏరియాల్లోకెల్లా రామగుండం-2 ఏరియా అధికోత్పత్తి సాధించింది. ఈ ఏరియా 127 శాతం లక్ష్యాన్ని చేరింది. ఆ తర్వాత 104 శాతం ఉత్పత్తితో బెల్లంపల్లి ఏరియా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని ఇల్లెందు ఏరియా 103 శాతం ఉత్పత్తితో రాష్ట్రవ్యాప్తంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. మణుగూరు 99, రామగుండం(3) 93, రామగుండం(1) 89, కొత్తగూడెం 88, భూపాలపల్లి 75, శ్రీరాంపూర్‌ 74, మందమర్రి 72, అడ్రియాల ప్రాజెక్టు 49 శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని