దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చిత్రంలో జితేందర్రెడ్డి, బాగం, పోటు ప్రసాద్, మౌలానా
ఖమ్మం మామిళ్లగూడెం: లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. భాజపాకు, ప్రధాని నరేంద్రమోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టించి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దిల్లీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరేన్లను అరెస్టు చేశారని, ఈ తరహాలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని సైతం ఇబ్బంది పెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రసంగించారనే వీడియోను సీఎం రేవంత్రెడ్డి షేర్ మాత్రమే చేశారని, దీనిపై దిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సైతం పలు సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీకి నోటీసులు మాత్రమే ఇచ్చారని, విచారణకు హాజరు కావాలని ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ఎక్కువ అసత్య, అసంబద్ధ దుష్ప్రచారాలను చేసేది భాజపా నేతలేనని విమర్శించారు. భాజపాను నడిపించే ఆరెస్సెస్ ముఖ్య ఉద్దేశం దేశ అభివృద్ధి కాదని, అనేక సందర్భాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు సైతం రిజర్వేషన్లు రద్దు చేస్తారేమోనన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయని, దీనిపై భాజపా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో సీపీఐ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి సమావేశం గురువారం జరుగుతుందని తెలిపారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్కె.జానీమియా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానొచ్చెనంటే.. వణుకొస్తది..!
[ 22-05-2024]
ఈసారి రుతుపవనాలు కాసింత ముందుగా ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా అధిక వర్షాలు కురుస్తాయని సంకేతాలిస్తోంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఖమ్మం నగరంతో పాటు మిగతా పురపాలికల్లోని కొన్ని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి. -
దృష్టి సారిస్తేనే ఉపయుక్తం..!
[ 22-05-2024]
విద్యార్థులు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు. పుస్తకాల్లో, తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలను సరిగ్గా చూడలేపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, వసతిగృహ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. -
పుడమి తల్లికి ప్రాణం పోద్దాం..
[ 22-05-2024]
వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల నుంచి వచ్చే అవశేషాలు, వ్యర్థాలను తొలగించే క్రమంలో రైతులు ఇటీవల పలు పొరపాట్లు చేస్తున్నారు. ఆయా పంటల కాలం ముగిశాక పొలాన్ని శుభ్రం చేయాలని, తదుపరి పంటకు భూమి సిద్ధం -
ఇక సన్న‘గిల్లవ్’ ఆశలు
[ 22-05-2024]
ఈ వానాకాలం నుంచి సన్నరకం ధాన్యం పండించే రైతులకు సర్కారు అండగా నిలవనుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. -
పదేళ్ల నుంచి తీన్మార్ మల్లన్నది రాజీలేని పోరాటం: తుమ్మల
[ 22-05-2024]
ప్రజా సమస్యలపై పదేళ్లుగా తీన్మార్ మల్లన్న రాజీలేని పోరాటం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. -
ఆతిథ్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 22-05-2024]
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల మంగళవారం తెలిపారు. -
మళ్లీ అధిక ఉత్పత్తే లక్ష్యం
[ 22-05-2024]
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించిన కొత్తగూడెం ఏరియా, మణుగూరు ఏరియాలకు రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం అధికోత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయిస్తోంది. -
ప్రతిపక్షాల ఐక్యత అవసరం: కూనంనేని
[ 22-05-2024]
దేశ సమైక్యత కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కులాలు, వ్యక్తుల మధ్య మతతత్వ భాజపా చిచ్చుపెడుతోందని ఆరోపించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 22-05-2024]
దమ్మపేట మండలంలో వరుసగా చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకులను, ఓ బాలుడిని బలితీసుకున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన రెండు లారీలు వారి పాలిట మృత్యుశకటాలయ్యాయి. -
తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం
[ 22-05-2024]
తల్లి ఒడిలో నిద్రిస్తున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
గ్రామీణ విద్యార్థినికి మొదటి ర్యాంకు
[ 22-05-2024]
గ్రామీణ ప్రాంత విద్యార్థిని.. ప్రభుత్వ పాఠశాల విద్యా నేపథ్యం.. లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు తగినట్టు శ్రమించి ఫలితాన్ని సాధించింది. కూసుమంచి మండలంలోని చేగొమ్మకు చెందిన రెడ్డిమల్ల యమున తెలంగాణ -
ప్రమాదంలో పశ్చిమ్ బంగా కూలీ మృతి
[ 22-05-2024]
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో పాల్గొంటున్న పశ్చిమ్ బంగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటనపై ఖమ్మం నగరం ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. -
చీటీల పేరుతో మోసం... నిందితుడి అరెస్టు
[ 22-05-2024]
ప్రయివేటు చీటీ పాటలు నిర్వహించి మోసగించిన వ్యక్తిని ఖమ్మం రెండో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం... ఖమ్మం నగరం కొత్తూరుకు చెందిన గౌని నరసింహారావు ప్రయివేటు చీటీలు నిర్వహించాడు. -
రామాలయం భూముల రక్షణపై సమీక్ష
[ 22-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఉన్న భూముల వివరాలపై హైదరాబాద్లో మంగళవారం దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, ఆశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్ఐఏ సోదాలతో దుర్గం ఉలికిపాటు
-
దయచేసి వినండి మీ రైలు రద్దయింది!.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
-
మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!