ఉపాధి కూలీలకు భానుడి సెగ
భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు.
కొత్తగూడెం సంక్షేమ విభాగం, న్యూస్టుడే: భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. కొన్ని మండలాల్లో కూలీలు ఉదయం 6 గంటల నుంచి 7 మధ్య బయల్దేరి వెళ్తున్నారు. పనులు పూర్తయి యాప్లో ఆన్లైన్ హాజరు నమోదయ్యేటప్పటికి 11 గంటలు దాటుతోంది. సాయంత్రం వేడి వాతావరణం, వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో వివిధ మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వాతావరణం ఉడికెత్తించేలా ఉందని, కనీస జాగ్రత్తలు తప్పనిసరని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కూలీల ఆరోగ్య సంరక్షణ దిశగా పథకం మండల స్థాయి అధికారులు కనీస చర్యలు చేపట్టాలి.
వసతులు: పథకం నిబంధనల ప్రకారం పని ప్రాంతాల్లో సేదతీరేందుకు నీడ సౌకర్యం కల్పించాలి. మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్యానికి కిట్లు అందించాలి. అరకొర నీటి క్యాన్ల ఏర్పాటుపై కూలీలు పెదవి విరుస్తున్నారు. ప్రాథమిక కిట్ల జాడే లేదు. పంట కాలువలు, చెరువుల పూడికతీత, చెట్ల నరికివేత వంటి పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించేలా సిబ్బంది అవగాహన కల్పించాలి.
ప్రమాద బీమా: అధిక ఉష్ణోగ్రతల కారణంగా పని ప్రదేశాల్లో విష పురుగులు, కందిరీగలు వంటివి దాడి చేసే అవకాశాలెక్కువ. ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు వర్తింపజేయాలన్న కూలీల డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలి. వడ[దెబ్బ, పాముకాటుతో అత్యధిక మంది కూలీలు మృత్యువాతపడుతున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఉపశమనం దక్కుతుంది.
వేసవి భత్యం: గతంలో ప్రతి కూలీకి వేసవి భత్యం చెల్లించేవారు. తాగునీరు, పరికరాలు, దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీ అందించేవారు. మూడేళ్లుగా వీటికి కోత విధించడంపై లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వీటిని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పనికి తగ్గ ఫలితం: ఏటా కేంద్ర ప్రభుత్వం కూలి రేటు పెంచుతుంది. అవేమీ పనికి తగిన ఫలితాన్నివ్వడం లేదన్నది కూలీల వాదన. ప్రస్తుతం రోజు కూలి రూ.300కు పెంచినా ఖాతాల్లో రూ.200-250 మధ్యే జమవుతోందని వాపోతున్నారు. గిట్టుబాటు కల్పించాల్సిన బాధ్యత అధికారులదే.
ఉపాధి కూలీల కోసం షామియానాలు, షేడ్ నెట్లు పంచాయతీల వారీగా సంఖ్యను బట్టి ఇప్పటికే సిబ్బందికి అందజేశాం. ఒక్కో గ్రామానికి ఒకటి నుంచి నాలుగు వరకు అందాయి. వాటిని పనిప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుని నీడలో ఉపశమనం పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించాం. చల్లటి మంచినీటి క్యాన్లు రోజూ తెప్పించాలని ఆదేశించాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు కూడా సరఫరా చేశాం. మండల స్థాయి అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు.
రవి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి
మొత్తం మండలాలు: 22
గ్రామ పంచాయతీలు: 481
జాబ్కార్డులు: 2.19 లక్షలు
కూలీలు: 4.51 లక్షల మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
[ 17-05-2024]
పాత లింగాల గ్రామంలో స్థానిక శాసనసభ్యుడు కోరం కనకయ్య, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి సమక్షంలో గరిడేపల్లి మాజీ సర్పంచ్ బోడ రాంజీ నాయక్ కాంగ్రెస్లో చేరారు. -
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది
[ 17-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ సెంటర్లో భారాస ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
ఖాతాకమామీషు
[ 17-05-2024]
సైబర్ నేరగాళ్ల అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న ముఠాల మూలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ విస్తరించి ఉంటున్నాయి. -
చిల్లిగవ్వ రాలే..
[ 17-05-2024]
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే ఎన్క్వాస్. -
కాసులు కురిపించిన తల్లాడ చెక్పోస్టు
[ 17-05-2024]
ఖమ్మం జిల్లా తల్లాడలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. -
గర్భిణులూ.. జాగ్రత్త
[ 17-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత సాధారణ జనాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
సమస్యల పరిష్కారంపైప్రత్యేక దృష్టి: జడ్పీ ఛైర్మన్ కంచర్ల
[ 17-05-2024]
జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. -
వైభవంగా సీతారామ కల్యాణం
[ 17-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తెలంగాణ ఉద్యమంలో రాందాస్ది కీలక పాత్ర
[ 17-05-2024]
తెలంగాణ తొలితరం ఉద్యమంలో కొలిశెట్టి రాందాస్నాయక్ కీలక పాత్ర పోషించారని ఉద్యమకారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ అన్నారు. -
మీ పిల్లలతో కథలు చదివిస్తారా..!
[ 17-05-2024]
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో నేటితరం విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకే పరిమితం అవుతున్నారు. -
వ్యవసాయ విద్యకు... సాంకేతిక దన్ను
[ 17-05-2024]
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. విద్యా రంగంలో సాంకేతికతను ప్రవేశ పెట్టడం విద్యార్థులకు మేలుచేసే అంశమే. -
నెల రోజుల్లో అందుబాటులోకి నూతన విద్యుత్తు ప్లాంటు
[ 17-05-2024]
అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ ఆవరణలో నిర్మాణంలో ఉన్న 2.5మెగావాట్ విద్యుత్తు ప్లాంటు మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని టీజీ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ బి.వి.సుధాకరరెడ్డి తెలిపారు. -
రాయలకు కడసారి వీడ్కోలు
[ 17-05-2024]
భారాస నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గురువారం పూర్తయ్యాయి. -
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
[ 17-05-2024]
నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో గురువారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
విమానయానం.. మూడు నెలల్లో 9.7 కోట్ల మంది!
-
ముగ్గురు బందీల మృతదేహాలు లభ్యం.. మృతుల్లో ఆ యువతి కూడా!
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య