logo

భాజపాతోనే సుస్థిర పాలన: తాండ్ర

భాజపాతోనే సుస్థిర పాలన సాధ్యమని ఖమ్మం లోక్‌సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. సత్తుపల్లి, మధిరలో శనివారం నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

Published : 05 May 2024 02:22 IST

సత్తుపల్లి: ప్రసంగిస్తున్న విజయరామారావు. వేదికపై తాండ్ర, గల్లా తదితరులు

సత్తుపల్లి, మధిర పట్టణం, న్యూస్‌టుడే: భాజపాతోనే సుస్థిర పాలన సాధ్యమని ఖమ్మం లోక్‌సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. సత్తుపల్లి, మధిరలో శనివారం నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తనను గెలిపిస్తే మోదీకి సైనికుడిలా, ప్రజల దూతలా పనిచేస్తానన్నారు. మాజీ మంత్రి కె.విజయరామారావు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుతుందని, రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. మధిర  పురపాలిక కౌన్సిలర్‌ జయమ్మ దంపతులు భాజపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని