logo

అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్‌ను గెలిపించండి: తుమ్మల

తాను మంత్రిగా గతంలో కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 06 May 2024 01:55 IST

కల్లూరు రోడ్‌షోలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. పక్కన రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే  రాగమయి తదితరులు

కల్లూరు, న్యూస్‌టుడే: తాను మంత్రిగా గతంలో కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అదేవిధమైన అభివృద్ధిని కాంక్షిస్తే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కల్లూరులో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి ప్రసంగించారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కల్లూరు మండలం నుంచి అత్యధిక మెజారిటీ లభించిందని గుర్తుచేశారు. అదేస్ఫూర్తితో మంత్రి పదవి చేపట్టిన తరువాత కల్లూరుకు అన్ని గ్రామాల నుంచి బీటీ రోడ్లు నిర్మించానన్నారు. ఇప్పుడు కల్లూరు మండలంలో ఏగ్రామానికి వెళ్లాలన్నా బెంజికారులో తిరుగుతున్నామని తెలిపారు. తనతోపాటే జిల్లా మంత్రులమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నామని అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే  రాగమయి అభివృద్ధి పనుల్లో ముందుంటారన్నారు. అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఒక్కసారి అవకాశమిస్తే ముగ్గురు మంత్రుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కల్లూరు మండలవాసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు యత్నిస్తానని తెలిపారు. హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రాగమయి, పొంగులేటి ప్రసాదరెడ్డి, మట్టా దయానంద్‌, నున్నా రామకృష్ణ, సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు మాదాల వెంకటేశ్వరరావు, దామాల దయాకర్‌, పసుమర్తి చందర్రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని