శాసనసభ ఎన్నికల ఫలితాలే పునరావృతం
కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమకు భరోసా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుందని ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు.
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో
ఈటీవీ, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమకు భరోసా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుందని ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలే సార్వత్రిక సమరంలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పునరావృతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేల సహకారంతో ప్రచారం సాగుతోందని చెప్పారు. తనకు రాజకీయాలు కొత్త కాదని.. తానూ రాజకీయాలకు కొత్త కాదని.. గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానంలో ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ‘ఈనాడు’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..
ఆరు గ్యారంటీలతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ప్రజలు నమ్మకంతోహస్తం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించాను. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
మంత్రులే ప్రచార రథసారథులు
ఖమ్మం లోక్సభ స్థానంలో భారీ ఆధిక్యం సాధించి పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి కానుకగా అందిస్తాం. రాహుల్గాంధీని ప్రధానమంత్రి చేయటంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు కీలక భూమిక పోషించబోతున్నాయి. ముగ్గురు మంత్రులు ప్రచార రథసారథులుగా వ్యవహరిస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయపరుస్తున్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని మరోసారి నిరూపించేలా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి.
కాంగ్రెస్తో దశాబ్దాల అనుబంధం
రాజకీయాలు నాకు కొత్తకాదు. నేనూ రాజకీయాలకు కొత్తేమీ కాదు. సుదీర్ఘ కాలంగా మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మా తాతయ్య, మానాన్న కాంగ్రెస్ పార్టీలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎదిగారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి మా కుటుంబం కృషి చేస్తోంది. సుమారు 20 ఏళ్లుగా నేనూ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నా. కూసుమంచి మండలం చేగొమ్మ నా స్వస్థలం. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల కోసం వందలాది ఎకరాల భూములను విరాళంగా అందించిన చరిత్ర మా కుటుంబానిది. ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపిస్తే వారి కష్టసుఖాల్లో ఒకడిగా ఉంటాను.
విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి
ఖమ్మం జిల్లా రాజకీయంగా, చారిత్రకంగా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. గత పదేళ్లుగా రాష్ట్రంలో భారాస, కేంద్రంలో భాజపా అధికారంలో ఉండటంతో అభివృద్ధిలో ఈ జిల్లా వెనుకబడింది. నన్ను ఎంపీగా గెలిపిస్తే అన్ని రంగాల్లో ఖమ్మం లోక్సభ స్థానాన్ని అగ్రగామిగా నిలబెడతా. ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం తీసుకొస్తాను. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు పరిశ్రమలకు అనువైనవి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ దిశగా అడుగులు వేస్తాను. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉభయ జిల్లాలకు రైల్వే ప్రాజెక్టులు తీసుకొస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే