logo

భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి: భంజ్‌దేవ్‌

భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్‌ మహారాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ అన్నారు. భాజపా లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 08 May 2024 02:34 IST

సభలో మాట్లాడుతున్న కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌, పక్కన అభ్యర్థి వినోద్‌రావు, నాయకులు

దమ్మపేట, న్యూస్‌టుడే: భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్‌ మహారాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ అన్నారు. భాజపా లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ దేశంలో మూడోసారి భాజపా అధికారంలోకి రావటం ఖాయమన్నారు.  భాజపా అభ్యర్థి వినోద్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ గ్యారంటీల అమలులో విఫలమైందని, మాయమాటలతో భారాస.. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణలో మాజీ సీఎం ఎన్టీఆర్‌ చేసిన సేవలు, చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నంబూరి రామలింగేశ్వరరావు, రంగా కిరణ్‌, దారా నాగేశ్వరరావు, ఉడతనేని విశ్వేశ్వరరావు, గొట్టిపూళ్ల శ్రీనివాసరావు, కొలికపోగు ములసయ్య, ముత్యాలరావు, జుజ్జూరి చెన్నారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు