ఖమ్మంలో కమల వికాసం ఖాయం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కాంగ్రెస్, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు.
భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావుతో ముఖాముఖి
ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కాంగ్రెస్, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. తెదేపా మద్దతుతో ఖమ్మం లోక్సభ స్థానంలో కమల వికాసం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈనాడు’తో ఆయన ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..
మోదీ కరిష్మానే భాజపాకు అదనపు బలం
ప్రపంచ పటంపై భారతదేశాన్ని సగర్వంగా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకి దక్కుతుంది. ‘కేంద్రంలో మూడోసారి మోదీ- ఖమ్మంతో జోడీ’ అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మోదీ కరిష్మా భాజపాకు అదనపు బలం. తెదేపా మద్దతుతో మాకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాష్ట్రంలో ఐదు నెలలకే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గతంలో భారాస అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నియంత మాదిరి వ్యవహరించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే జాతీయ రహదారుల నిర్మాణం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్, భారాస నాయకులు ఆరోపిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో ఈమాత్రమైనా అభివృద్ధి కనిపిస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం చలవే. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం రూ.12వేల కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే వివిధ పథకాల్లో కేంద్రం వాటా నిధులు ఉన్నాయి. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి భాజపా అధికారంలోకి రావటం ఖాయం. ఇక్కడా భాజపాను ఆశీర్వదిస్తే అభివృద్ధి గాడిన పడుతుంది.
నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తా
ప్రజలు ఎంపీగా గెలిపిస్తే గిరిజనుల అభ్యున్నతి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తా. ఖమ్మం లోక్సభ స్థానంలో మెరికల్లాంటి క్రీడాకారులు ఉన్నా.. అందుకు తగినట్లుగా సౌకర్యాలు లేవు. వసతుల కల్పనపై దృష్టి సారిస్తా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు చొరవ చూపుతా. పామాయిల్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ను నెరవేర్చేందుకు యత్నిస్తా. సారవంతమైన భూములున్నా ఆ స్థాయిలో పంటల సాగు, దిగుబడులు లేవు. మండలానికో బయో ఇన్పుట్ ల్యాబ్ ఏర్పాటుకు కృషి చేస్తాను.
ఆదరిస్తే అద్భుతాలు చేసి చూపిస్తా
నేడు ఈ గడ్డపై పుట్టిన బిడ్డను. మా సొంతూరు భద్రాద్రి జిల్లా ములకలపల్లి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో ఎలా పరుగులు పెట్టించాలనే అంశంపై ప్రణాళిక ఉంది. తప్పుడు వాగ్దానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజల భ్రమలు తొలగిపోయాయి. అయిదో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉన్న భారత్ను మూడో స్థానంలోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారు. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్’ నినాదంపై ప్రజలకు విశ్వాసం ఉంది. ఖమ్మం లోక్సభ స్థానంలో ప్రజలు ఆదరిస్తే అన్ని రంగాల్లో జిల్లా అబ్బురపడేలా అభివృద్ధి చేసి చూపిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీతారామ ప్రాజెక్టు కాలువను వేగంగా పూర్తి చేయాలి
[ 19-05-2024]
సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వేగవంతంగా పూర్తి చేసి సాగు, తాగునీటిని సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెం పాటి అప్పారావు అన్నారు. -
మేమేం పాపం చేశాం నాన్నా..!
[ 19-05-2024]
ఆస్తి కోసం ఓ కర్కశకుడు కన్నతల్లి, తన ఇద్దరు కూతుళ్లను హతమార్చిన సంఘటనతో.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య మృతితో త్రివేణిని రెండో వివాహం చేసుకోవడం.. -
బాధిత మహిళలకు భరోసా..
[ 19-05-2024]
ప్రస్తుత సమాజంలో మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. లైంగిక వేధింపులు. జరిగే అన్యాయాన్ని పరువు కోసం బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్న వారెందరో ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 55 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్
[ 19-05-2024]
పూర్వ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశించారు. ఉప ఎన్నిక సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. -
టీఎస్ఈఏపీ సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. -
ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!
[ 19-05-2024]
పదో తరగతి ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ‘2024-25’ విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పిడుగుపాటుతో రైతు మృతి
[ 19-05-2024]
పిడుగుపాటుకు పొలంలో ఓ రైతు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం గ్రామానికి చెందిన సంపసాల కృష్ణ(55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు: తమ్మినేని
[ 19-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 19-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. -
‘మహస్వి’కి 102వ ర్యాంకు
[ 19-05-2024]
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాల్లో ఖమ్మం న్యూవిజన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జి.మహస్వి రాష్ట్రస్థాయిలో 102వ ర్యాంకు సాధింది. జేఈఈ మెయిన్స్లో సైతం ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 732వ ర్యాంకు సాధించటం విశేషం. -
ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
[ 19-05-2024]
2024-25 విద్యా సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన విదేశాల్లో చదివే గిరిజన విద్యార్థులు ఈనెల 31 లోపు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎన్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. -
రహదారుల పనులకు అనుమతి ఇవ్వండి: తుమ్మల
[ 19-05-2024]
ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ ఫేజ్-1, 3, ఎల్డబ్ల్యూఈ 2018-19, ఎస్సీఏ స్కీం కింద ప్రారంభించిన రహదారుల పనులకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అటవీశాఖ మంత్రి, పీసీసీఎఫ్లకు విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్-1 ప్రిలిమ్స్కు ఏర్పాట్లు
[ 19-05-2024]
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ గౌతమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!