‘కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు’
కాంగ్రెస్ చెప్పే బూటకపు మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
సత్తుపల్లిలో మాట్లాడుతున్న భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి, పెనుబల్లి, న్యూస్టుడే: కాంగ్రెస్ చెప్పే బూటకపు మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లిలోని భారాస బూత్ కమిటీలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం సత్తుపల్లి మండలం, పెనుబల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం చేశారు. అలవికాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్రంలో గద్దెనెక్కిందని విమర్శించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఖమ్మం లోక్సభ స్థానంలో భారాస విజయం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి ఇక్కట్లతో పాటు విద్యుత్తు సమస్య వెంటాడుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సత్తుపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సత్తుపల్లి పుర ఛైర్మన్ కూసంపూడి మహేశ్, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రఫీ, అనిల్కుమార్, సూరిబాబు, బాబీ పాల్గొన్నారు. కల్లూరు మండలం కప్పలబంధానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శీలం నారాయణరెడ్డి భారాసలో చేరారు. ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చక్కిలాల మోహన్రావు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కనగాల వెంకట్రావు, భుక్యా ప్రసాద్ పాల్గొన్నారు.
బోనకల్లు: ఎంపీగా కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి, జిల్లాకు అనేక నిధులు తీసుకొచ్చానని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభ ఎన్నికల సమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని విమర్శించారు. తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ది పథంలో నడవాలంటే భారాసను బలపర్చాలని ప్రజలను కోరారు. నామా నాగేశ్వరరావును మరోమారు ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు