వేసవి గట్టెక్కేదెలా..?
వేసవి సమీపిస్తోంది. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో ప్రజలకు నీటిఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. కృష్ణా బ్యారేజీ నుంచి కాలువలకు విడుదలవుతున్న నీటిని నిల్వ చేసి వేసవిలో ప్రజలకు అందించే అవకాశాలపై అధికారులు సరైన
పైపులైన్ల ఏర్పాటుతో ఎద్దడికి పరిష్కారం
కోరుకొల్లు, కలిదిండి, కైకలూరు, న్యూస్టుడే
కైకలూరు : పెంచికలమర్రు సామూహిక రక్షిత మంచినీటి పథకం
వేసవి సమీపిస్తోంది. కొల్లేరు, ఉప్పుటేరు తీర ప్రాంతాల్లో ప్రజలకు నీటిఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. కృష్ణా బ్యారేజీ నుంచి కాలువలకు విడుదలవుతున్న నీటిని నిల్వ చేసి వేసవిలో ప్రజలకు అందించే అవకాశాలపై అధికారులు సరైన దృష్టి సారించడంలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10, 15 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన సామూహిక రక్షిత మంచినీటి పథకాలు ఈసారీ అక్కరకు వచ్చే సూచనలు కనపించడం లేదు. ప్రస్తుతం ఉన్న చెరువులను పూర్తిస్థాయిలో నింపినా.. 45 రోజులు మించి నీరు నిల్వ ఉండని పరిస్థితి ఈ ప్రాంతాల్లో నెలకొంది. నేల స్వభావం కూడా అందుకు ప్రధాన కారణం.
ఆరేళ్లుగా సాగుతోంది
తాడినాడ, చినతాడినాడ, పోతుమర్రు పంచాయతీల పరిధిలోని 11 గ్రామాలకు తాగునీరు అందించాలన్న సంకల్పంతో తాడినాడలో రూ13.కోట్ల అంచనాలతో సామూహిక రక్షిత మంచినీటి పథకం నిర్మాణానికి ఆరేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. కొవిడ్ నేపథ్యం, వర్షాలు, తదితర అంశాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నుంచి వేయాల్సిన పైపులైన్ల విషయంలో తలెత్తిన అభ్యంతరాలు.. ఇలా ఏదో ఒకటి మోకాలడ్డుతూ వస్తోంది. ఈ వేసవికైనా శుద్ధ జలం వస్తుంది, ఉప్పుటేరు దాటి పడవలపై తాగునీరు తెచ్చుకునే కష్టం తీరుతుందని ఆశించిన ఏటి తీర గ్రామాల ప్రజల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. పైపులైన్ల నిర్మాణంలో అధికారులు చొరవ చూపిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మేజర్ పంచాయతీలు కలిదిండి, కోరుకొల్లులో సుమారు 12వేల పైచిలుకు చొప్పున జనాభా ఉన్నారు. కోరుకొల్లులో ప్రస్తుత అవసరాలకు 5.30ఎకరాల్లో చెరువు ఉంది. వేసవిలో నీటి ఎద్దటి ఎదుర్కొనేందుకు ఇది చాలకపోవడంతో కొత్త ఎస్సీ కాలనీలో ఇటీవల రెండెకరాల చెరువును అందుబాటులోకి తెచ్చినా ప్రయోజనం లేదు. ఉన్న చెరువులకు అదనంగా ఒక్కో గ్రామంలో సుమారు 10 ఎకరాల చెరువు నిర్మించేందుకు స్థానిక నాయకులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా స్థలం కొరత ప్రధానంగా వేధిస్తోంది.
అదనంగా చెరువు అవసరం
మండవల్లి మండలం తక్కెళ్లపాడు సామూహిక మంచినీటి పథకాన్ని 14 గ్రామాలకు అనుసంధానం చేస్తూ నిర్మించారు. ప్రస్తుతం రెండు గ్రామాలకు మాత్రమే నీరందుతుంది. కేవలం 7 ఎకరాల చెరువు మాత్రమే ఉండటంతో వేసవితో తీవ్ర ఎద్దడి ఉంటుంది. నిల్వ సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో చెరువు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
చింతపాడులో రూ.50 లక్షల వ్యయంతో మరో మంచినీటి పథకం ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు అధికారులు ప్రకటించినా పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇది ఆచరణలో పెడితే మరో 8 లంక గ్రామాలకు తాగునీరు అందించవచ్ఛు
రెండు గ్రామాలకే నీరు●
కైకలూరు మండలంలో కొల్లేరు లంక గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పెంచికలమర్రు సామూహిక రక్షిత నీటి పథకం వృథాగా మారింది. 16 గ్రామాలకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ పథకం పైపులైను పనులు అటకెక్కాయి. 20 ఎకరాల విస్తీర్ణంలో మూడు చెరువులు కలిపి 60 ఎకరాల్లో నీరు అందుబాటులో ఉంది. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం వద్ద గోదావరి జలాలు ఈ పథకానికి తరలించేందుకు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రస్తుతం రెండు గ్రామాలకు మాత్రమే అరకొరగా నీరు విడుదల చేస్తున్నారు. ఆ నీరు కూడా తాగడానికి అనువుగా లేవని స్థానికులు చెబుతున్నారు.
కైకలూరు మండలం తామరకొల్లు, వింజరం, ఆచవరం, రాచపట్నం, సీతనపల్లి, దొడ్డిపట్ల్ల, రామవరం, గోనిపాడులో రక్షిత నీటి పథకాలు శుద్ధజలం అందించలేని స్థితిలో ఉన్నాయి. దీంతో ఊటబావుల నీరే దిక్కవుతున్నాయి. వాటి సంరక్షణకైనా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఆటపాక, తామరకొల్లు గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ సుజలస్రవంతి, సుజలధార పథకాల్లో శుద్ధ జల కేంద్రాలు నిర్మించారు. ప్రస్తుతం వీటి నిర్వహణ సరిగాలేక అలంకారప్రాయంగా మారాయి. ఆచరణలో పెడితే వేసవిలో ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయి.
త్వరలో పూర్తిస్థాయి వసతులు
తాడినాడ, పెంచికలమర్రు తాగునీటి పథకాలపై ఆధారపడి ఉన్న గ్రామాలకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతాం. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు పథకాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం టెండరు ప్రకటన చేశాం అన్ని గ్రామాలకు పైపులు ఏర్పాటు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చూస్తాం. కలిదిండి, కోరుకొల్లు, కైకలూరు వంటి మేజర్ పంచాయతీల్లో పెరుగుతున్న జనాభా, నీటి అవసరాల దృష్ట్యా అదనపు చెరువుల ఏర్పాటుపై సమగ్ర పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాం. - శాస్త్రి, డీఈఈ, ఆర్డబ్ల్యూఎస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్