తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని ఎన్నికల రోల్ అబ్జర్వర్ మురళీధర్రెడ్డి ఆదేశించారు.
ఎన్నికల రోల్ అబ్జర్వర్ మురళీధర్రెడ్డి
మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు మురళీధర్రెడ్డి, పక్కన కలెక్టర్ కోటేశ్వరరావు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని ఎన్నికల రోల్ అబ్జర్వర్ మురళీధర్రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక ఓటరు నమోదు, సవరణపై కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్వోలు (తహసీల్దార్లు), వివిధ పార్టీల నాయకులతో కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ వంద శాతం తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి పార్టీలు సహకరించాలన్నారు. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లుగా నమోదు చేయించాలని, ప్రత్యేకించి కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆధార్-ఓటరు అనుసంధానం కార్యక్రమం జరుగుతోందని.. ఫలితంగా డూప్లికేట్ ఓటర్లకు అవకాశం ఉండదన్నారు. కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బీఎల్వోలతో సమన్వయం చేసుకునేందుకు వీలుగా రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఏలను నియమించుకోవాలన్నారు. కాంగ్రెస్, తెదేపా నాయకులు కరుణాకర్ బాబు, జస్వంత్ పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి డీఆర్వో మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత కలలకు రెక్కలు తొడుగుతాం
[ 04-05-2024]
ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. -
పార్కు స్థలాల్లో నేతల పాగా
[ 04-05-2024]
వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు.. పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. -
పొలం గట్టున జగన్ కనికట్టు
[ 04-05-2024]
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. -
జగనాసుర ‘చట్టం’
[ 04-05-2024]
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం -
తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
[ 04-05-2024]
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. -
కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
[ 04-05-2024]
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. -
మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు
[ 04-05-2024]
శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. -
జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
[ 04-05-2024]
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. -
సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
[ 04-05-2024]
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
పొంగుతున్న గోవా మద్యం
[ 04-05-2024]
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. -
విధుల నుంచి 45 మంది తొలగింపు
[ 04-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..