logo

తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం

మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్‌రెడ్డిని నిలదీశారు.

Published : 04 May 2024 04:28 IST

ప్రదీప్‌రెడ్డిని నిలదీస్తున్న జాలవాడి మహిళలు

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్‌రెడ్డిని నిలదీశారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిమిత్తం గ్రామానికి రావడంతో తాగునీటి ఎద్దడిపై మహిళలు ప్రశ్నించారు. దళితవాడపై ఎందుకు చిన్నచూపు చూపారని అడిగారు. తాగడానికి గుక్కెడు నీరందించని పాలకులు ఓటెందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓటర్లు గుర్తుకొస్తారు, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోరని నిలదీశారు. వారానికోసారి అర్ధరాత్రి కేవలం ఒకటి, రెండు బిందెల నీళ్లు వదిలితే ఎలా అని వాపోయారు. దీంతో ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే గ్రామానికి ట్యాంకర్ల ద్వారా తాగునీరందిస్తామని చెప్పడంతో శాంతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని