జగనాసుర ‘చట్టం’
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం
కర్నూలు న్యాయవిభాగం, గాయత్రీ ఎస్టేట్, ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం అమలుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూవివాదాలను కోర్టులో పరిష్కరించుకునే హక్కును వైకాపా ప్రభుత్వం కాలరాసింది. భూ సర్వే పూర్తి చేయకుండా చట్టం చేయటంపై పలువురు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ అధికారుల చేతిల్లోకి.. - సుందర్సింగ్
అధ్యక్షుడు, ఆదోని బార్ అసోసియేషన్
భూ హక్కు చట్టంతో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రెవెన్యూ అధికారుల చేతిలోని ఈ చట్టం వెళ్తుంది. దీంతో రాజకీయ నాయకులు ప్రవేశించే ప్రమాదం ఉంది. పారదర్శకత ఉండదు. ఇప్పటివరకు విధి విధానాలు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తే ఆందోళన చేస్తాం.
కోర్టు ధిక్కారమే - ఎం.వి.చక్రపాణి, జిల్లా బార్
అసోసియేషన్ మాజీ కార్యదర్శి
రెవెన్యూ అధికారులకు పెత్తనం అప్పగించి ప్రజలకు నష్టం కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా న్యాయవాదులమంతా పోరాటం చేశాం. చట్టానికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేస్తే హైకోర్టు స్టే ఇచ్చినా ప్రభుత్వం చట్టాన్ని అమలుచేయడం కోర్టు ధిక్కారమే. ప్రభుత్వ తీరుపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం.
పాసు పుస్తకంపై జగన్ బొమ్మ ఎందుకు..
- కేసీ రాముడు, న్యాయవాది
భూయాజమాన్య పత్రాలపై జగన్ చిత్రం వేయడం తగదు. న్యాయపరమైన తీర్పులు చెప్పే బాధ్యతలను రెవెన్యూ అధికారులకు అప్పగించటం ద్వారా అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమించుకుని దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది. రెవెన్యూ అధికారులు యాజమాన్య హక్కులు నిర్ధారించటం ప్రమాదకరం.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనే.. - బి.కృష్ణమూర్తి,
జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ఈ చట్టం అమలుతో భూయజమానులు.. వారికి తెలియకుండానే ఆస్తులపై హక్కులు కోల్పోతారు. అందుకే ఈ చట్టాన్ని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ చట్టం అమలు చేయటం కచ్చితంగా కోడ్ ఉల్లంఘనే. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకుని దీనిని తక్షణమే రద్దు చేయాలి.
కేసు దాఖలు చేసేదెలా?
- తాయన్న, న్యాయవాది ఆదోని
భూ హక్కు చట్టం అమలైతే వివాదం తలెత్తినపుడు సివిల్ కోర్టులో కేసులు దాఖలు చేసే అవకాశం ఉండదు. భూ హక్కు చట్టానికి సంబంధించి అధికారిని ఇంతవరకు నియమించలేదు. అప్పీలకు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. రైతులకు ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండో సంతకం కింద భూ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం హర్షణీయం.
అధికార పార్టీ ఆదేశాలే అమలు - వీరన్న నాయుడు
న్యాయవాది, ఆదోని
భూ హక్కు చట్టంలో అధికార పార్టీ ఆదేశాలతో అధికారులు నడచుకునే ప్రమాదముంది. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి న్యాయం జరుగుతుంది. పేదలు, అమాయకులకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ. కొందరు రెవెన్యూ అధికారుల తప్పిదాలతో రైతులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. చట్టాన్ని రద్దు చేయాలి. .
వెంటనే ఆపేయాలి - రవికాంత్ప్రసాద్,
జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులే యాజమాన్య హక్కులు నిర్ధారిస్తారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం. చట్టం అమలుకు సంబంధించి మెమో జారీ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. విధివిధానాలు తెలియజేయకుండా.. స్పష్టత ఇవ్వకుండా అమలు చేసిన ఈ చట్టాన్ని వెంటనే ఆపేయాల్సిన అవసరం ఉంది.
ఇదో అసంబద్ధమైన చట్టం - నాగేంద్రనాథ్
న్యాయవాది
అసెంబ్లీలో హేతుబద్ధమైన చర్చ జరపకుండా చట్టం అమలు చేయటం దారుణం. ఇది పూర్తిగా అసంబద్ధమైన చట్టం. రెవెన్యూ దస్త్రాలను నవీకరించకుండా, సర్వే చేయకుండా అమలుచేయడం దారుణం. వారసత్వాన్ని అధికారులే నిర్ధారిస్తే ఎలా.. ఈ చట్టం కారణంగా భూవివాదాలు మరిన్ని పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. న్యాయ కార్యదర్శిగానీ.. రెవెన్యూ కార్యదర్శిగానీ ఈ చట్టంపై మాట్లాడకుండా అనర్హులైన ప్రభుత్వ సలహాదారుడితో మాట్లాడించడం సరైంది కాదు. ఈ చట్టం అమలును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శుకనంపై చిరుత దాడి
[ 18-05-2024]
సున్నిపెంటలోని వెస్ట్రన్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్