సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు.
నంద్యాల సర్వజన ఆసుపత్రి వైద్యుల తీరు
ప్రైవేట్ ఆసుపత్రికి రావాలని ఇచ్చిన పత్రాన్ని చూపుతున్న మహేశ్
నంద్యాల పాతపట్టణం, న్యూస్టుడే : సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వాటిని చూసి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్యులు పరీక్షించి తమ ప్రైవేటు ఆసుపత్రికి రావాలని చెబుతున్నారు. ఓ వైద్యుడు ఏకంగా ఆసుపత్రి ఓపీలోనే ప్రైవేటు ఆసుపత్రి వివరాలతో కూడిన చిరునామా పత్రాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించిన తర్వాత సమస్య ఏంటో రోగులకు చెప్పడం లేదు. తమ ఆసుపత్రికి వస్తేనే మీ ఆరోగ్య సమస్య ఏంటి? దానికి పరిష్కారం చెబుతామని చిరునామా పత్రాన్ని ఇస్తున్నారు. అక్కడికెళితే వేలకు వేలు దోచుకుంటారని రోగులు ఆందోళన చెందుతున్నారు.
- నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఇటీవల నరాలకు సంబంధించిన న్యూరోసర్జన్, ఫిజీషియన్, మూత్రపిండాలకు సంబంధించి యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులను నియమించి కొంత మేరకే సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే తన ఎన్నికల ప్రచార ప్రతాల్లో ముద్రించి వీధి వీధిలో ప్రజలకు పంచుతున్నారు. దీంతో రోగుల సంఖ్య పెరిగింది. దీన్ని అవకాశంగా మల్చుకోవాలని భావించిన వైద్యుడు రోగులను తన ప్రైవేటు ఆసుపత్రికి రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. సర్వజన వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి సైతం తన ఆసుపత్రికొస్తే మెరుగైన చికిత్స అందిస్తానని చెబుతుండటం గమనార్హం.
డబ్బు లేకనే కదా ప్రభుత్వాసుపత్రికి వచ్చేది - మహేశ్, నంద్యాల
నాకు వెన్ను నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో నరాల వైద్యుడు ఉన్నారని మూడు రోజుల కిందట వచ్చాను. వైద్యుడు పరీక్షించి ఎమ్మారై స్కానింగ్ చేయించారు. సమస్య చెప్పమంటే తన ప్రైవేటు ఆసుపత్రి చిరునామా పేపరు ఇచ్చి అక్కడికొస్తేనే చెబుతా అంటున్నారు. అక్కడికి వెళితే ఓపీనే రూ.500 ఉంటుంది. అంత డబ్బు లేకనే కదా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. ప్రభుత్వ ఆసుపత్రిలో జీతం తీసుకుంటూ ప్రైవేటుగా వైద్యం చేస్తాననడం దారుణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం