logo

కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత

మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్‌ఛార్జి మురళీమోహన్‌రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు.

Published : 04 May 2024 04:27 IST

వైకాపా మండల ఇన్‌ఛార్జి మురళీమోహన్‌రెడ్డిని తాగునీటిని అడుగుతున్న పోతుల ఈరమ్మ

కోసిగి, న్యూస్‌టుడే: మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్‌ఛార్జి మురళీమోహన్‌రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. శుక్రవారం కోసిగిలో వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. శాంతినగర్‌లో పోతుల ఈరమ్మ అనే మహిళ మా కాలనీకి ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి కుళాయిలు కావాలని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇతర కాలనీ మహిళలు సైతం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు సర్ది చెబుతూ ముందుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని