జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు.
కొలువుల కోసం శ్రీశైలం జలాశయం నిర్వాసితుల పోరాటం
నందికొట్కూరు, న్యూస్టుడే : శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. ఐదేళ్లు గద్దెపైన ఉన్న ఆయన ఒక్కరికీ కొలువు ఇవ్వలేదు.. కనీసం వాలంటరీగా పని చేసే అవకాశం కల్పించలేదు. నిర్వాసితులు 2021 సెప్టెంబరులో వందరోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వైకాపా మంత్రుల కార్లను అడ్డుకొని గోడు విన్నవించుకున్నారు. జీవో 98 ప్రకారం నిర్వాసితుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.. గత తెదేపా హయాంలో 965 మందికి ఒప్పంద కార్మికులుగా అవకాశం ఇచ్చారు.. వీరిలో 150 మంది క్రమబద్ధీకరణ జరిగింది. మిగిలిన బాధితులు ఏళ్లుగా కొలువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వైకాపా ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోలేదు.. ‘ఓటు’తో గుణపాఠం చెబుతామని నిర్వాసిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
ధర్నా చేస్తున్న నిర్వాసితులు
66 గ్రామాలు ఖాళీ చేయించారు
శ్రీశైలం జలాశయం నిర్మాణానికి 1965లో పునాది వేశారు. 1984లో జాతికి అంకితం చేశారు. నిర్మాణ సమయంలో కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం(ఆత్మకూరు) నియోజకవర్గాల్లోని 66 గ్రామాల్లో 32 వేల కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 85వేల ఎకరాలు నది గర్భంలో కలిసింది. ఒక్క పైసా పరిహారం ఇవ్వకుండా పోలీసు బందోబస్తు నడుమ గ్రామాలను ఖాళీ చేయించారు. ఆదుకోవాలంటూ నిర్వాసితులు 1986 నుంచి ఆందోళన చేస్తున్నారు. దిగొచ్చిన ప్రభుత్వం ఆయా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీవో 98ను తీసుకొచ్చారు. అనంతరం 1994లో ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 చొప్పున పరిహారం అందించారు. 1965 కుటుంబాల్లో చదువుకొన్న యువకులు కొలువుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. నిర్వాసితులు నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు.
మునక భూములపై అధికారం కన్ను
శ్రీశైలం జలాశయం మునక భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో 63 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వీటి పరిధిలోని సుమారు 35 వేల ఎకరాలు మునిగింది.. జులై నుంచి నవంబరు వరకు వెనుక జలాలు ఉంటాయి. తర్వాత కృష్ణానదిలో క్రమంగా నీరు తగ్గిపోతుంది. ఆ సమయంలో నిర్వాసితుల్లో కొందరు ఏటా పంటలు సాగు చేస్తున్నారు. అవి సారవంతంగా ఉండటంతో పంటల దిగుబడి అధికంగా ఉంటుంది. దీంతో అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేసి.. పంచాయితీలు చేస్తున్నారు. అనధికారికంగా పొలాలను విక్రయిస్తున్నారు. కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం, బలపాలతిప్ప, సిద్ధేశ్వరం గ్రామాల్లో నివసిస్తున్న వారు సుమారు 1300 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఓ బడారైతు వాటిని ఆక్రమించుకుని సాగు ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రాంతానికి నివాసం మార్చిన ఆయన ఆ పొలాలను కౌలుకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకునేవారు. తమ పొలాలు తామే సాగు చేసుకుంటామని రైతులు డిమాండ్ చేయగా అందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో రాజకీయ నాయకులు పంచాయితీలు చేశారు.
ఆగని పోరాటం
కొలువులు ఇస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ నిర్వాసితులందరికీ న్యాయం దక్కలేదు. 965 మందికి ఒప్పంద పద్ధతిలో లస్కర్లుగా పనిచేసే అవకాశం కల్పించారు. మిగిలిన వారు కొలువు పోరాటం చేస్తూనే ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. వాటిలో అవకాశం కల్పించాలని పోరాటం చేసి అలసిపోయారు. ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం పొందిన వారు క్రమబద్ధీకరణ కోసం విన్నవిస్తున్నారు. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, పునరావాస ప్రయోజనాలు కల్పించకపోవడంతో చాలా మంది దర్జీలు, కౌలుదారులు, ఎల్ఐసీ ఏజెంట్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ‘కొలువు’దీరిన తర్వాత పెళ్లిచేసుకుందామని బ్రహ్మచారులుగా మిగిలిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
హామీని అమలు చేయాలి
- మల్లికార్జునరెడ్డి, నిర్వాసితుడు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల ముందు బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. దీనిపై పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినా ఫలితం లేదు. కనీసం వాలంటరీ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
- భానుప్రసాద్, నిర్వాసితుడు
ఓట్ల సమయంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి ఓటు వేయించుకున్నా జగన్ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. ఉద్యోగాలు రాక 1000 కుటుంబాలున్నాయి. ఒక్కో ఇంట్లో 3 నుంచి 5 ఓట్ల చొప్పున సుమారు 4వేల ఓట్లున్నాయి. ఉద్యోగం ఇవ్వాలని పోరాడుతూ.. జీవనం కోసం వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!