పొంగుతున్న గోవా మద్యం
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది.
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి చెక్పోస్టు వద్ద కంటైనర్లో గోవా మద్యం భారీగా పట్టుబడటం సంచలనంగా మారింది. ఓట్ల కోసం.. అక్రమార్జనకు వైకాపా నాయకులు మద్యం రవాణాకు బరితెగిస్తున్నా అధికారులు అంతంతమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.
భారీఎత్తున రవాణా
కర్ణాటకతోపాటు గోవా సైతం నకిలీ మద్యానికి కేంద్రంగా గుర్తింపు పొందింది. కర్ణాటక కంటే గోవాలో అధిక బ్రాండ్లు లభ్యమవుతాయి. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ నకిలీ మద్యం తయారు చేస్తారు. అక్కడ చిన్నచిన్న ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నకిలీ మద్యం భారీగా తయారవుతోంది. కర్ణాటకకు చెందిన పలువురు అక్రమార్కులు మధ్యవర్తులుగా వ్యవహరించి ఉమ్మడి జిల్లాకు రవాణా చేస్తున్నారు. జిల్లాలో పలువురు వైకాపా నాయకులకు వారితో సత్సంబంధాలున్నాయి. గతంలో పలుమార్లు గోవా మద్యాన్ని కర్నూలు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. బనగానపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి బావమరిది గతంలో ఇలానే లారీలో భారీ మోతాదులో అక్రమ మద్యం తెప్పించి దొరికిపోవటం సంచలనంగా మారింది.
వైకాపా నేతల బరితెగింపు
ఎన్నికలు సమీపిస్తున్నందున వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. ఆస్పరి మండలం యాటకల్లు-తొగలగట్టు రస్తా వద్ద వైకాపా నేత శ్రీకాంత్రెడ్డితోపాటు మరో నలుగురిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసి రూ.3.62 లక్షల విలువ చేసే 60బాక్సుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆదోని మండలం సంతెకుడ్లూరులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రూ.2లక్షల విలువ చేసే 50బాక్సుల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఏప్రిల్ 30న మంత్రాలయం పోలీసులు నాలుగు బాక్సుల కర్ణాటక మద్యం పట్టుకున్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే కర్నూలు జిల్లా సరిహద్దులోని ఏడు చెక్పోస్టుల పరిధిలో 50మంది 22 వాహనాలతో పట్టుబడగా.. 3,063లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవటం గమనార్హం. మొత్తంమీద ఏప్రిల్ నెలలోనే కర్నూలు జిల్లాలోని ఏడు సెబ్ స్టేషన్ల పరిధిలో 201మందిని అరెస్టు చేసి 165 కేసులు నమోదు చేసి 6,946లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్టులు మరింత పటిష్టపరిస్తే ఇంకా భారీగా అక్రమ మద్యం పట్టుబడే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
-
పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం .. ఐదుగురి మృతి
-
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య