logo

సీఎం పర్యటనకు కట్టుదిట్ట ఏర్పాట్లు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ డా.సృజన తెలిపారు. ఆమె బుధవారం పత్తికొండలో పర్యటించారు.

Published : 01 Jun 2023 05:22 IST

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ సృజన

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ డా.సృజన తెలిపారు. ఆమె బుధవారం పత్తికొండలో పర్యటించారు. పట్టణ వీధుల్లో సాగే ర్యాలీకి సంబంధించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర అధికారుల వాహనాల రాకపోకలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి.

పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ కృష్ణకాంత్‌ సూచించారు. ఆయన పోలీసు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. గురువారం ఉదయం పత్తికొండ పట్టణంలోకి వాహనాలను అనుమతించకూడదని చెప్పారు. అత్యవసరం, అనుమతులు ఉన్నవాటిని మాత్రమే అనుమతించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని