logo

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు.

Published : 26 Apr 2024 06:01 IST

లోక్‌సభ స్థానానికి 28 మంది, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 155 మంది నామపత్రాల దాఖలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. కర్నూలు లోక్‌సభ స్థానానికి 28 మంది అభ్యర్థులు 41 నామపత్రాలు దాఖలు చేశారు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 155 మంది అభ్యర్థులు 241 నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని